బుల్లితెరపైకి ఎంట్రీ ఇవ్వనున్న దేవి శ్రీ ప్రసాద్.. సంగీత ప్రియులకు మరింత చేరువగా రాక్ స్టార్..

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకు అటు మాస్ ప్రేక్షకులతోపాటు, మెలోడిగానూ అలరించి

బుల్లితెరపైకి ఎంట్రీ ఇవ్వనున్న దేవి శ్రీ ప్రసాద్.. సంగీత ప్రియులకు మరింత చేరువగా రాక్ స్టార్..
Devi Sri Prasad
Follow us

|

Updated on: Mar 13, 2021 | 10:59 AM

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకు అటు మాస్ ప్రేక్షకులతోపాటు, మెలోడిగానూ అలరించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ రాక్ స్టార్. గత కొన్ని రోజులుగా దేవి శ్రీ  ప్రసాద్ కు సరైన హిట్టు లేకుండా ఉన్నాడు. ఇటీవల విడుదలైన ఉప్పెన సినిమాతో మరోసారి ఫాంలోకి వచ్చాడు దేవి శ్రీ ప్రసాద్.  బుల్లితెరపైకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటివరకు వెండితెరపై తనదైన మ్యూజిక్‏తో ప్రేక్షకులను అలరించిన దేవి శ్రీ ప్రసాద్ బుల్లితెరపై తన మార్క్ చూపించబోతున్నాడు. ఇటీవల విడుదలైన ఉప్పెన సినిమాతో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాతో వందకోట్ల రూపాయాల వరకు గ్రాస్ సాధించాడు. ఇక అదే జోష్‏తో టెలివిజన్‏లో అలరించేందుకు సిద్ధమయ్యాడు దేవి. ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‏గా మారింది.

ప్రస్తుతం దేవి శ్రీ ప్రసాద్ టాలీవుడ్‏లో వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇవే కాకుండా త్వరలోనే జీ తమిళ్‏లో చేయబోతున్న ఓ మ్యూజిక్ ప్రోగ్రామ్ కు కూడా దేవిశ్రీ ప్రసాద్ సారథ్యం వహించబోతున్నాడు. దీనిని రాక్‏స్టార్ అనే పేరుతో కండక్ట్ చేయబోతున్నారు మేకర్స్. దీంతో తమిళ్ ప్రేక్షకులను మరోసారి తన మ్యూజిక్‏తో మైమరపించనున్నాడు రాక్ స్టార్. చాలా రోజుల తర్వాత దేవి శ్రీ ప్రసాద్ ఉప్పెన మూవీతో సక్సెస్ అందుకున్నాడు. దీంతో వరుస సినిమా ఆఫర్లను అందుకుంటూ బిజీగా మారిపోయాడు. తాజాగా బుల్లితెరపైకి ఎంట్రీ ఇవ్వబోతున్న దేవి శ్రీ ప్రసాద్.. అక్కడ కూడా తన మార్క్ కొనసాగిస్తాడా ? లేదా ? అనేది చూడాలి.

Also Read:

శర్వానంద్ ‘శ్రీకారం’ మూవీ నిజాంగానే కాపీ కొట్టారా ?.. అసలు విషయం చెప్పిన ఆర్ఎక్స్100 డైరెక్టర్…