Darshan : జైల్లో ఉన్న కొడుకును కలిసిన దర్శన్ తల్లి.. అమ్మను చూసి కన్నీళ్లు ఆపుకోలేక..

కుటుంబాన్ని కలిసిన తర్వాత దర్శన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. సోమవారం ఉదయం దర్శన్‌ను కలిసేందుకు తల్లి మీనా, సోదరుడు దినకర్‌, భార్య విజయలక్ష్మి, కుమారుడు వినీష్‌ వచ్చారు. ఈ సమయంలో దర్శన్, అతని తల్లి భావోద్వేగానికి గురయ్యారు. దర్శన్ సోదరుడు వారిద్దరినీ ఓదార్చాడు. అయితే దర్శన్ కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడంపై వివాదం రేగింది.

Darshan : జైల్లో ఉన్న కొడుకును కలిసిన దర్శన్ తల్లి.. అమ్మను చూసి కన్నీళ్లు ఆపుకోలేక..
Hero Darshan
Follow us

|

Updated on: Jul 02, 2024 | 8:37 AM

బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్న కన్నడ సూపర్ స్టార్ దర్శన్‌ను ఆయన తల్లి, సోదరుడు, భార్య, కుమారుడు పరామర్శించారు. కుటుంబాన్ని కలిసిన తర్వాత దర్శన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. సోమవారం ఉదయం దర్శన్‌ను కలిసేందుకు తల్లి మీనా, సోదరుడు దినకర్‌, భార్య విజయలక్ష్మి, కుమారుడు వినీష్‌ వచ్చారు. ఈ సమయంలో దర్శన్, అతని తల్లి భావోద్వేగానికి గురయ్యారు. దర్శన్ సోదరుడు వారిద్దరినీ ఓదార్చాడు. అయితే దర్శన్ కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడంపై వివాదం రేగింది.

తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ తుగ్‌దీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దర్శన్ తన అభిమానిని హత్య చేయించాడు. జూన్‌లో నటి పవిత్ర గౌడతో పాటు అరెస్టయ్యాడు దర్శన్. చిత్రదుర్గలో ఉండే 33 ఏళ్ల రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్, అతని స్నేహితురాలు పవిత్ర గౌడతో పాటు మరో 15 మందిని అరెస్టు చేశారు పోలీసులు.

దర్శన్ అభిమాని రేణుకాస్వామి పవిత్ర గౌడను సోషల్ మీడియాలో అసభ్యకరమైన మెసేజులు పంపాడు. అలాగే ఆమెను బెదిరించాడని తెలుస్తోంది. దాంతో పవిత్ర గౌడ దర్శన్ కు రేణుక స్వామి గురించి చెప్పింది. ఆతర్వాత రేణుకాస్వామి కిడ్నాప్‌కు గురయ్యారు. అతన్ని కిడ్నాప్ చేసి బెంగుళూరుకు తీసుకొచ్చారు. అక్కడ ఓ షెడ్డులో ఉంచి చిత్రహింసలు పెట్టి హత్య చేశారు. పోలీసుల విచారణలో ఈ హత్య చేయించింది దర్శన్‌ అని తేలింది. పోలీసులు దర్శన్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు దర్శన్‌కు జూలై 4 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దర్శన్ అరెస్ట్ అయిన తర్వాత తొలిసారిగా ఆయన కుటుంబసభ్యులు జైలుకు వెళ్లి పరామర్శించారు. కుటుంబాన్ని చూసి దర్శన్ భావోద్వేగానికి గురయ్యాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.