Allu Arjun: వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన అల్లు అర్జున్‌.. రూ.25 లక్షలు విరాళంగా అందించిన ఐకాన్‌ స్టార్‌..

ఇటీవల కురిసిన కుండపోత వర్షాలకు ఆంధ్రప్రదేశ్‌ అతలాకుతలమైంది. ముఖ్యంగా రాయలసీమలోని నాలుగు జిల్లాలు, నెల్లూరు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

Allu Arjun: వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన అల్లు అర్జున్‌.. రూ.25 లక్షలు విరాళంగా అందించిన ఐకాన్‌ స్టార్‌..
Follow us

|

Updated on: Dec 02, 2021 | 11:07 AM

ఇటీవల కురిసిన కుండపోత వర్షాలకు ఆంధ్రప్రదేశ్‌ అతలాకుతలమైంది. ముఖ్యంగా రాయలసీమలోని నాలుగు జిల్లాలు, నెల్లూరు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలకు పలువురి ఇళ్లు నేలమట్టం కాగా, వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో వరదల కారణంగా రోడ్డున పడ్డ ఏపీ ప్రజలకు ఆదుకునేందుకు టాలీవుడ్‌ హీరోలు ముందుకొస్తున్నారు. పలువురు ప్రమఖులు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, ప్రిన్స్‌ మహేశ్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌ తలా రూ. 25లక్షలు, గీతా ఆర్ట్స్‌ తరఫున నిర్మాత అల్లు అరవింద్‌ రూ. 10 లక్షలు ఏపీ సీఎం సహాయనిధికి విరాళంగా అందించారు.

తాజాగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. తన వంతు సాయంగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌కి రూ. 25 లక్షలు విరాళం ప్రకటించారు. ఈ విషయాన్నే ఆయనే ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ‘ఇటీవల సంభవించిన వరదల వల్ల ఏపీ ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. వారిని చూసి నా హృదయం తల్లడిల్లింది. వారిని ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న సహాయ కార్యక్రమాలకు చేయూతగా నా వంతు రూ.25 లక్షలు విరాళంగా అందిస్తున్నాను’ అంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు ఐకాన్‌ స్టార్‌.

Also Read:

Nikita Dutta: తలపై కొట్టి ఫోన్‌ లాక్కెళ్లారు.. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్న బాలీవుడ్‌ నటి..

Ramcharan: ఆచార్యలో చరణ్‌ పాత్రపై క్లారిటీ!.. సినిమాలో ఎంతసేపు కనిపించనున్నాడంటే..

RGV: నేను హైదరాబాద్‌లో ఉన్నా.. మీరు స్వర్గంలో ఉన్నారు అంతే తేడా.. సిరివెన్నెల మృతిపై రామ్‌ గోపాల్‌ వర్మ..