AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఆ నటుడితో అలాంటి సీన్.. దెబ్బకు భయంతో పారిపోయిన హీరోయిన్.. చివరకు..

తెలుగులో తొలి సినిమాతోనే కథానాయికగా క్రేజ్ సొంతం చేసుకుంది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుని దూసుకుపోతుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. ఫస్ట్ మూవీ తర్వాత ఆడపాదడపా చిత్రాల్లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది. అయితే ఇటీవల ఓ సినిమాలో ఆమెకు జరిగిన ఓ చేదు అనుభవాన్ని గుర్తుచేసుకుంది.

Tollywood: ఆ నటుడితో అలాంటి సీన్.. దెబ్బకు భయంతో పారిపోయిన హీరోయిన్.. చివరకు..
Shalini Pandey
Rajitha Chanti
|

Updated on: Apr 24, 2025 | 1:23 PM

Share

టాలీవుడ్ సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని హీరోయిన్. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ఆశించిన స్థాయిలో ఆఫర్స్ అందుకోలేదు. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది ఈ అమ్మడు. అయితే ఇటీవలే ఓ సినిమా చిత్రీకరణలో ఓ నటుడితో ఇంటిమేట్ సీన్ చేయడానికి భయపడి ఇంటికి పారిపోయిందట. ఆమె మరెవరో కాదు.. అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే. తెలుగులో ఆఫర్స్ తగ్గిపోవడంతో బాలీవుడ్ షిప్ట్ అయ్యింది. ఇటీవలే మహారాజ్ చిత్రంలో నటించింది. సిద్దార్థ్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షాలిని పాండేతోపాటు జునైద్ ఖాన్, జైదీప్ ఆహ్లావత్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో కొన్ని ఇంటిమేట్ సీన్స్ లో కనిపించింది షాలిని. అయితే ఇంటిమేట్ సీన్స్ లో నటించడం అంత సులభం కాదని షాలిని చెప్పుకొచ్చింది.

ఈ చిత్రంలో నటుడు జైదీప్ తో ఇంటిమేట్ సీన్ చేయాల్సి ఉందని.. ఆ సీన్ షూట్ చేసే ముందు తాను బయటకు పరుగెత్తి పారిపోయానని తెలిపింది. ఆ సమయంలో ఒత్తిడిగా అనిపించిందని.. అలాంటి వాతావరణం.. చీకటి ఉన్నప్పుడు యాక్టింగ్ చాలా భయం వేసిందని.. దీంతో తనకు ప్రశాంతమైన వాతావరణం కావాలని దర్శకుడిని అడిగానని.. ఆయన అర్థం చేసుకుని తనకు స్పేస్ ఇచ్చారని తెలిపింది. దీంతో ఆ సీన్ లో నటించగలిగానని చెప్పుకొచ్చింది. ఈ సినిమాను 1800 కాలంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా సిద్దార్థ్ మల్హోత్రా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జైదీప్ ఈ చిత్రంలో స్త్రీలని లైంగిక వేధింపులకు పాల్పడే వ్యక్తిగా నటించారు.

మహారాజ్ సినిమాలో కిషోరి పాత్రను పోషించింది. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత మహానటి, ఇద్దరి లోకం ఒకటే వంటి చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత తెలుగులో ఆఫర్స్ తగ్గిపోవడంతో హిందీలోకి వెళ్లింది. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది.

View this post on Instagram

A post shared by Shalini Pandey (@shalzp)

ఇవి కూడా చదవండి :  

Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..

Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..

OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..