
హీరోయిన్స్ పబ్లిక్ ప్లేస్ లో కనిపిస్తే చాలు.. అభిమానులు ఎగబడుతూ ఉంటారు. సెల్ఫీలు, షేక్ హ్యాండ్స్ అంటూ నన రచ్చ చేస్తారు. కొంతమంది ఓపికగా అభిమానులకు సెల్ఫీలు, ఆటోగ్రాఫ్ లు ఇస్తుంటారు. అలాగే హీరోయిన్స్ ఏదైనా ఫంక్షన్స్, లేదా పార్టీల్లో కనిపిస్తే చాలు ఫోటోగ్రాఫర్స్ వెంటపడి మరీ ఫోటోలు తీస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఫోటోగ్రాఫర్స్ చేసే పనికి హీరోయిన్స్ చిరాకు పడుతూ ఉంటారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా ఫోటోగ్రాఫర్స్ పై సీరియస్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో పై నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్ ను తిడుతూ కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకూ ఆమె ఎవరు.? ఆమె చేసిన పనేంటో తెలుసా..
ఇండస్ట్రీలో గ్లామరస్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న భామల్లోప్రగ్యా జైస్వాల్ ఒకరు. డేగ అనే సినిమాతో ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. తమిళం, తెలుగుతో పాటు హిందీలో కూడా తెరంగేట్రం చేసింది ఈ బ్యూటీ. మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది. తరువాత క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమాలో నటించింది. కంచె సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసినా కూడా అంతగా పాపులర్ అవ్వలేకపోయింది. సినిమాలతో పాటు చాలా యాడ్స్ లోనూ నటించింది.
ఇక ఈ ముద్దుగుమ్మ అఖండ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరోయిన్ గానే కాదు సెకండ్ హీరోయిన్ గానూ ఈ అమ్మడు ఆకట్టుకుంది. రీసెంట్ గా బాలయ్య డాకు మహారాజ్ సినిమాలో కనిపించింది. కాగా తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ పార్టీలో కనిపించింది. ఆమెను చూడగానే ఫోటో గ్రాఫర్స్ ఒక్కసారిగా ఆమెను ఫోటోలు తీయడానికి ఎగబడ్డారు. దాంతో ఆమె కాస్త చిరాకు పడింది. ఇందుకు సంబందించిన వీడియో వైరల్ గా మారింది. అయితే నెటిజన్స్ ప్రగ్య పై ఫైర్ అవుతున్నారు. అలాంటి డ్రస్ వేసుకోవడం ఎందుకు ఫోటోలు తీస్తే ఇబ్బంది పడి ఫోటోగ్రాఫర్స్ పై చిరాకు పడటం ఎందుకు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ఈ అందాల తార. తన అందాలతో కుర్రకారు మతిపోగోడుతుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..