
Neha Sshetty : అన్ని వర్గాల ప్రేక్షకులను ‘డిజె టిల్లు’ సినిమా ఆకట్టుకుంటుందని చెబుతోంది అందాల భామ నేహా శెట్టి. ఈ బ్యూటీ రాధిక పాత్రలో నటించిన ‘డిజె టిల్లు’ ఈనెల 12న థియేటర్ లలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ తో కలసి ఈ చిత్రాన్ని నిర్మించింది. విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగ వంశీ చిత్ర నిర్మాత. తాజాగా ‘డిజె టిల్లు’ సినిమా విశేషాలను, చిత్రంలో నటించిన తన అనుభవాలను తెలిపింది నేహా శెట్టి. ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ..చిన్నతనం నుంచే నటి కావాలనే కోరిక ఉండేది. హృతిక్ రోషన్ సినిమాలో డాన్సులు చూసి ఇండస్ట్రీ పై ఇష్టాన్ని పెంచుకున్నాను. చదువు పూర్తయ్యాక మోడలింగ్ చేశాను. మలయాళంలో ముంగారమళై 2 చిత్రంలో నటించాక, తెలుగులో పూరీ జగన్నాథ్ గారి దగ్గర నుంచి పిలుపు వచ్చింది. మెహబూబా చిత్రంలో నటించాను. ఆ సినిమా తర్వాత కొన్నాళ్లు యూఎస్ వెళ్లి అక్కడ న్యూయార్క్ ఫిల్మ్ అకాడెమీలో నటనలో కోర్సు నేర్చుకున్నాను. అక్కడి నుంచి వచ్చాక గల్లీ రౌడీ, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ చిత్రాల్లో నటించాను. ఇప్పుడు “డిజె టిల్లు” సినిమా విడుదల కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని తెలిపింది.
సితార ఎంటర్ టైన్ మెంట్స్ లాంటి ప్రముఖ సంస్థలో అవకాశం వస్తే ఎలా కాదనుకుంటాం. ఈ సినిమా ఒప్పుకోవడానికి అదొక్కటే కారణం కాదు, మంచి స్క్రిప్ట్ ఉంది. సిద్ధూ, విమల్ క్రియేటివ్ గా సినిమాను, ఫన్ గా డిజైన్ చేశారు. మీరు ట్రైలర్ లో డైలాగ్స్ వినే ఉంటారు. ఇవన్నీ కలిసిన ఒక మంచి ప్రాజెక్ట్ లో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నా అని అంటుంది ఈ బ్యూటీ. అలాగే డిజె టిల్లు ట్రైలర్ చూసి రొమాంటిక్ ఫిల్మ్ అనుకుంటారు కానీ ఈ సినిమా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపిన ఒక ప్యాకేజ్ లాంటిది. ఇందులో కామెడీ, థ్రిల్, ఎంటర్ టైన్ మెంట్, రొమాన్స్ అన్నీ ఉన్నాయని తెలిపింది నేహా.
మరిన్ని ఇక్కడ చదవండి :