Nayanthara : ఆ సమయంలో నన్ను చాలా భయపెట్టారు.. కానీ నేను ఎవ్వరి మాటలు వినలేదు
22ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది అందాల ముద్దుగుమ్మ నయనతార. కెరీర్ బిగినింగ్ లో చంద్రముఖి, గజినీ సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా నటించినా ఆతర్వాత మెయిన్ హీరోయిన్ గా మారి బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇండస్ట్రీని ఏలుతున్న ఈ అమ్మడు ఫ్యాన్స్ చేత లేడీ సూపర్ స్టార్ అని పిలిపించుకుంటుంది

సినిమా ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా క్రేజ్ సొంతం చేసుకుంది నయనతార. హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తెలుగు, తమిళ్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది నయన్. తెలుగు, తమిళ్ లోనే కాదు హిందీలోనూ నటించి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.. హిందీలో జవాన్ సినిమాతో భారీ హిట్ తో పాటు కలెక్షన్స్ పారంగానూ రికార్డ్ క్రియేట్ చేసింది. పెళ్లి తర్వాత నయన్ ఆచి తూచి సినిమాలు చేస్తుంది. స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తుంది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమాలో చేస్తుంది నయన్.
ఇదిలా ఉంటే తాజాగా నయనతార చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నయన్ మాట్లాడుతూ.. ఐటెం సాంగ్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. నయన్ గతంలో స్పెషల్ సాంగ్ చేసింది. అయితే ఆమె మాట్లాడుతూ.. స్పెషల్ సాంగ్స్ విషయంలో చాలా మంది చాలా రకాలుగా తనను భయపెట్టారని తెలిపింది. విజయ్ హీరోగా నటించిన శివకాశి అనే సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే ఛాన్స్ వచ్చింది. ఆ సాంగ్ చేయడానికి నేను ఓకే చెప్పా.. అయితే ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నావ్ అంటూ చాలా మంది విమర్శించారు.
ఒక్క సారి అలాంటి సాంగ్ చేస్తే ఇక పై అలాంటి అవకాశాలే వస్తాయని అన్నారు. అయితే స్పెషల్ సాంగ్ అంటే స్పెషలే.. ఒక ఇమేజ్ వస్తేనే ఇలాంటి స్పెషల్ సాంగ్స్ ఛాన్స్ లు వస్తాయని నాకు అనిపించింది. అలాగే స్పెషల్ సాంగ్స్ వల్ల చాలా నేర్చుకోవచ్చు అనిపించింది. అందుకే నేను రెండు స్పెషల్ సాంగ్స్ చేశా, ఆ సాంగ్స్ వల్ల చాలా నేర్చుకున్నా అని తెలిపింది నయన్.. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




