ఎవ్వడికీ బయపడేదిలేదు.. ఇండియన్ ఆర్మీని పొగిడితే నన్ను అన్ ఫాలో చేస్తామని బెదిరిస్తున్నారు..
భారత్పై పాక్ దాడులు కొనసాగుతున్నాయి. జమ్ము టార్గెట్గా పాకిస్తాన్ డ్రోన్ దాడులకు దిగింది. జమ్ము ఎయిర్పోర్ట్పై రాకెట్తో దాడి చేసింది. జమ్ములో మొత్తం ఏడు చోట్ల భారీగా పేలుళ్ల శబ్దం వచ్చాయి. జమ్ము, కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ అమృత్సర్లో బ్లాక్అవుట్ చేపట్టారు. అటు జమ్ము, కశ్మీర్, అఖ్నూర్లో సైరన్లు మోగాయి. పాకిస్తాన్కు చెందిన మూడు యుద్ధ విమానాలును భారత్ కూల్చివేసింది.

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తలు తీవ్రతరం అయ్యాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అయితే ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ భారత్పై ప్రతీకార చర్యలను స్టార్ట్ చేసింది. భారత్ సరిహద్దు ప్రాంతాల్లోని నగరాలే టార్గెట్గా పదే పదే కాల్పులు, డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులకు తెగబడుతోంది. ఇక పాకిస్తాన్ దాడులను భారత్ సైన్యం సమర్థవంతంగా తిప్పి కొడుతోంది. ఈ క్రమంలోనే శనివారం తెల్లవారుజామున భారత్లోకి వచ్చిన పాక్ డ్రోన్లను ఇండియన్ ఆర్మీ కూల్చివేసింది. భారత్లోని పశ్చిమ సరిహద్దు ప్రాంతమైన ఖాసా కంటోన్మెంట్ పరిధిలోని సాధారణ పౌరులపై పాకిస్తాన్ డ్రోన్లతో దాడులకు ప్రయత్నించింది. ఆ దాడులను భారత్ సమర్ధవంతంగా తిప్పికోట్టింది. ఇప్పటికీ యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే పాక్ దాడులకు ప్రతిదాడులు చేస్తున్న ఇండియా ఆర్మీని అభినందిస్తూ సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు.
అయితే భారత్ ను పొగిడినందుకు ఓ హీరోయిన్ కు బెదిరింపులు వస్తున్నాయట. భారత్ ను పొగిడితే సోషల్ మీడియాలో అన్ ఫాలో చేస్తాం అంటూ బెదిరిస్తున్నారని తెలిపింది అయినా సరే క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదు అని స్పష్టం చేసింది ఆ హీరోయిన్ ఇంతకూ ఆమె ఎవరెంటే.. బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ హిమాచల్ ప్రదేశ్లోని షిమ్లాలో జన్మించింది. ఆమె తండ్రి కల్నల్ వి.కె. జైట్లీ పంజాబీ హిందూ, భారత సైన్యంలో ఆఫీసర్గా పనిచేశారు, తల్లి మీతా ఆఫ్ఘన్ హిందూ, భారత సైన్యంలో నర్సుగా పనిచేశారు.
బాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగులోనూ నటించింది సెలీనా జైట్లీ. సీతారాముడు సినిమాలో నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే ఇటీవలే ఆమె ఇండియా, పాక్ యుద్ధ నేపథ్యంలో భారత్ ను కొనియాడుతూ కొన్ని పోస్ట్ లు షేర్ చేసింది. దాంతో కొందరు ఆమెను ట్రోల్ చేస్తున్నారని తెలిపింది. ఈమేరకు ఆమె సోషల్ మీడియాలో ఓ భారీ పోస్ట్ షేర్ చేసింది. “ఇండియా గురించి మాట్లాడితే నన్ను సోషల్ మీడియాలో అన్ఫాలో చేస్తామని కొంతమంది బెదిరిస్తున్నారు. అలా బెదిరించేవారి కోసమే ఈ పోస్ట్ షేర్ చేస్తున్నా.. నా దేశం కోసం స్టాండ్ తీసుకున్నందుకు నేను ఎప్పటికీ, ఎవ్వరికీ క్షమాపణలు చెప్పను. ఉగ్రవాదం పేరుతో అమాయకుల ప్రాణాలు తీస్తుంటే మౌనంగా ఉండను. ఎంతోమంది అమాయకులను చంపేశారు. హింసను సమర్ధించే వారివైపు నేను ఎప్పుడూ ఉండను. మిమ్మల్ని బాధపెడితే.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా వినిపించే నా మాటలు మీరు వినలేకపోతే.. నన్ను ఫాలో అవ్వడం మానేయండి. నేను శాంతి కోసం, సత్యం కోసం నిలబడతాను. ఎప్పుడూ నా సైనికుల వెంటే ఉంటాను. ఎందుకంటే నా సైనికులు పేరు, మతం అడగకుండానే రక్షిస్తారు అంటూ రాసుకొచ్చింది సెలీనా జైట్లీ. ఇప్పుడు ఈ హీరోయిన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు ఇండియన్స్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.