Radhe Shyam: ప్రభాస్ ఫ్యాన్స్కు ఈరోజు బిగ్ డే.. రాధేశ్యామ్ ట్రైలర్ ఎన్ని గంటలకు రానుందంటే..
Radhe Shyam:సాహో చిత్రం తర్వాత ప్రభాస్ (Prabhas) మళ్లీ వెండి తెరపై కనిపించలేదు. వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నా థియేటర్లో ఒక్క సినిమా..
Radhe Shyam:సాహో చిత్రం తర్వాత ప్రభాస్ (Prabhas) మళ్లీ వెండి తెరపై కనిపించలేదు. వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నా థియేటర్లో ఒక్క సినిమా లేకపోయే సరికి డార్లింగ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే వీరి ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పెడుతూ రాధేశ్యామ్ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది. నిజానికి ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా (Corona) కారణంగా పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజాగా పరిస్థితులన్నీ అనుకూలించడంతో ఎట్టకేలకు ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. మార్చి 11న రాధేశ్యామ్ సినిమాను విడుదల చేయనున్నారు. 1960లో జరిగిన ఓ అందమైన ప్రేమకథ నేపథ్యంలో అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించారు మేకర్స్. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్లో వేగాన్ని పెంచింది.
ఇందులో భాగంగా నే ఈరోజు (బుధవారం) రాధేశ్యామ్ ట్రైలర్ను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ రడీ అయ్యింది. ఈ క్రమంలోనే మధ్యాహ్నం 3 గంటలకు ట్రైలర్ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇదిలా ఉంటే హైదరాబాద్లో జరిగిన ప్రిరిలీజ్ ఈవెంట్లో భాగంగా సినిమా మొదటి ట్రైలర్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సినిమా రిలీజ్ ట్రైలర్ను చిత్ర యూనిట్ విడుదల చేయనుంది. ఇక రాధేశ్యామ్ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్కు జోడిగా పూజా హెగ్డే నటిస్తున్నారు. కృష్ణం రాజు, జగపతి బాబులు కీలక పాత్రలో నటిస్తున్నారు.