Aadi Saikumar: ఎవడిది వాడు సెట్‌ చేసుకున్నోడే దమ్మున్నోడు.. ఆసక్తికరంగా ‘అతిథి దేవోభవ’ టీజర్‌..

హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు యంగ్‌ హీరో ఆది సాయి కుమార్‌

Aadi Saikumar: ఎవడిది వాడు సెట్‌ చేసుకున్నోడే దమ్మున్నోడు.. ఆసక్తికరంగా 'అతిథి దేవోభవ' టీజర్‌..
Follow us

|

Updated on: Dec 21, 2021 | 9:40 PM

హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు యంగ్‌ హీరో ఆది సాయి కుమార్‌. ఈ ఏడాది ‘శశి’ సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించిన అతని చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలున్నాయి. ‘జంగిల్‌’, ‘కిరాతక’, ‘బ్లాక్‌’ సినిమాలతో పాటు ‘అతిథి దేవోభవ’ అనే మరో చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నువేక్ష ఆది సరసన సందడి చేయనుంది. కొత్త దర్శకుడు పొలిమేర నాగేశ్వర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శేఖర్‌ చంద్ర స్వరాలు సమకూరుస్తున్నారు. శ్రీనివాసా సినీ క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రాజాబాబు, అశోక్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా మంగళవారం ‘అతిథి దేవోభవ’ టీజర్‌ విడుదలైంది. కొన్ని సరదా సన్నివేశాలు, ట్విస్ట్‌లతో కూడిన ఈ టీజర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది.

టీజర్‌ చూస్తుంటే సినిమాలో ఏదో అనారోగ్య సమస్యతోనో లేదా లోపంతోనో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈసినిమాలోని పవర్‌ఫుల్‌ డైలాగులు కూడా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ‘రాముడికి లక్ష్మణుడు వెంట ఉన్నట్లే నా భయం ఎప్పుడూ నాతోనే ఉంటుంది’, ‘ఒకరు చెప్పాడని ఇంకొకడితో చేయించేవాడు కాదురా.. ఎవడిది వాడు సెట్‌ చేసుకున్నోడే దమ్మున్నోడు’ అంటూ ఆది నోటి డైలాగులు బాగా పేలాయి. కాగా త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

Also Read:

Sai Dharam Tej: మెగా హీరో తర్వాతి సినిమా ఆ మాస్‌ దర్శకుడితోనేనా?

Nani Dasara Movie: నాని సినిమాలో నటించాలని ఉందా.? తెలుగు మాట్లాడే వారికే ఈ సదవకాశం..

Rajamouli: పవన్‌, మహేష్‌, దిల్‌రాజుకు స్పెషల్‌ థ్యాంక్స్‌ చెప్పిన జక్కన్న.. ఎందుకో తెలుసా.?