వికలాంగుడిగా కనిపించనున్న యంగ్ హీరో?

'జాను' సినిమాతో అందరికీ ఓ ఎమోషనల్ టచ్ ఇచ్చిన టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్.. ప్రస్తుతం 'శ్రీకారం' అనే సినిమా చేస్తున్నాడు. అలాగే ఫేమస్ కొరియాగ్రాఫర్ రాజు సుందరం డైరెక్షన్‌లో మరో తెలుగు, తమిళ భాషలో ఓ సినిమా చేస్తున్నాడు. కాగా గతంలో శర్వా తమిళ సినిమాలు..

వికలాంగుడిగా కనిపించనున్న యంగ్ హీరో?
Follow us

| Edited By:

Updated on: Aug 31, 2020 | 11:15 AM

‘జాను’ సినిమాతో అందరికీ ఓ ఎమోషనల్ టచ్ ఇచ్చిన టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్.. ప్రస్తుతం ‘శ్రీకారం’ అనే సినిమా చేస్తున్నాడు. అలాగే ఫేమస్ కొరియాగ్రాఫర్ రాజు సుందరం డైరెక్షన్‌లో మరో తెలుగు, తమిళ భాషలో ఓ సినిమా చేస్తున్నాడు. కాగా గతంలో శర్వా తమిళ సినిమాలు చేశాడు. ఎంజియుమ్ ఎప్పొధుమ్ (జర్నీ), వాజ్కాయ్(రాజాధి రాజా) వంటి చిత్రాలు చేశాడు. అవే సినిమాలను తెలుగులో కూడా డబ్ చేశారు. కాగా ఇప్పుడు ఆర్‌ఎక్స్100 సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ అజయ్ భూపతి దర్మకత్వంలో మరో సినిమా ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ సినిమాకు మహా సముద్రం అనే పేరు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం శర్వానంద్ మరో వైవిధ్యమైన సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రకాష్ అనే కొత్త డైరెక్టర్ చెప్పిన వికలాంగుడి కథ శర్వానంద్‌కు బాగా నచ్చిందట. అందుకే ఆ సినిమాలో హీరోగా నటించడానికి శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. చూడాలి మరి ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఎదురు చూడాల్సిందే.

Read More:

కేజీఎఫ్‌-2లో ప్రకాష్ రాజ్ పాత్ర అదేనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

ప్రపంచ వ్యాప్తంగా 2.53 కోట్ల‌కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు