అదిరిపోయే స్కెచ్తో గోల్డ్ షాపులో భారీ దోపిడి.. కట్ చేస్తే నలుగురు అరెస్ట్..
విజయవాడలో పట్టపగలే గోల్డ్ షాపులో జరిగిన దోపిడి సంచలనంగా మారింది. ఈ దోపిడి సీనంతా అచ్చం సినిమా స్టైల్లో సాగింది. ఈ కేసులో నలుగురు నిందితులను ఎంతో చాకచక్యంతో అరెస్ట్ చేశారు పోలీసులు. వివరాల్లోకి వెళ్తే.. సాయి చరణ్ అనే గోల్డ్ షాపులో..
విజయవాడలో పట్టపగలే గోల్డ్ షాపులో జరిగిన దోపిడి సంచలనంగా మారింది. ఈ దోపిడి సీనంతా అచ్చం సినిమా స్టైల్లో సాగింది. ఈ కేసులో నలుగురు నిందితులను ఎంతో చాకచక్యంతో అరెస్ట్ చేశారు పోలీసులు. వివరాల్లోకి వెళ్తే.. సాయి చరణ్ అనే గోల్డ్ షాపులో ఈ ఘటన జరిగింది. కరోనా వైరస్ కారణంగా విజయవాడలో షాపులు తెరిచేందుకు అనుమతి లేకపోవడంతో ఓ బిల్డింగ్లో బంగారం విక్రయాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే అవసరమైన వారికి బంగారాన్ని షాపు నుంచి రోజూ తీసుకొస్తూ ఉండేవారు. దీన్ని పసిగట్టిన దుండగులు ఓ రోజు బంగారాన్ని తీసుకెళ్తున్న గుమాస్తాను దారిలో మాటు వేశారు. అతన్ని బెదిరించి.. బంగారం షాపు వద్దకు తీసుకెళ్లారు. అలాగే అక్కడున్న సెక్యూరిటీని, గుమస్తాను గాయపరిచి కాళ్లూ చేతులు కట్టేసి వారు బంగారంతో పాటు అక్కడున్న నగదును కూడా దోచుకెళ్లారు.
ఈ ఘటన తెలిసిన బంగారు షాపు యజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని.. ఐదు బృందాలుగా ఏర్పడి మొత్తానికి నిందితులను పట్టుకున్నారు. రాజస్థాన్కు చెందిన నలుగురు వ్యక్తులు ఈ దొంగతనానికి పాల్పడ్డారని తెలిపారు పోలీసులు. ఓ ప్రైవేటు వాహనంలో బంగారం, డబ్బుతో ఉడాయిస్తుండగా.. ప్రకాశం బ్యారేజ్ దగ్గరలోని కృష్ణవేణి ఘాట్ వద్ద దొంగలను పట్టుకున్నారు పోలీసులు.
కాగా ఈ దొంగలకు, షాపులో పనిచేస్తూ గాయపడ్డ విక్రమ్ సింగ్కు సంబంధం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. విక్రమ్ సింగ్ కావాలనే సీన్ క్రియేట్ చేసి దొంగతనం చేయించినట్టు భావిస్తున్నారు పోలీసులు. రెండు నెలల క్రితమే షాపులో సెక్యూరిటీగా పనికి చేరాడు రాజస్థాన్కు చెందిన విక్రమ్ సింగ్. కాగా అక్కడున్న సీసీ కెమెరాలో చోరీ అంతా రికార్డు అయ్యిందని.. డీవీఆర్ను కాల్వలో పడేసారు నిందితులు. కాగా ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు నిందితులను విచారిస్తున్నారు పోలీసులు.
Read More:
రోడ్డుపై కరోనా పేషెంట్ల ధర్నా.. భయంతో పారిపోయిన స్థానికులు..
ఏపీలోని ఈ మూడు జిల్లాల్లోనే అత్యధిక కరోనా కేసులు..
పొట్టకూటి కోసం కర్రసాము చేస్తోన్న బామ్మ.. స్పందించిన బాలీవుడ్ నటులు