రోడ్డుపై కరోనా పేషెంట్ల ధర్నా.. భయంతో పారిపోయిన స్థానికులు..
చెన్నైలో రోడ్డుపై ధర్నాకు దిగారు కరోనా పేషెంట్స్. మంకాడు ముత్తుకుమారన్ మెడికల్ కాలేజీలో తమకు ఎలాంటి ప్రాథమిక సదుపాయాలు కల్పించలేదని రోడ్డు మీదకొచ్చేశారు కోవిడ్ బాధితులు. తాగునీరు, ఆహారం, చికిత్స సరిగ్గా ఇవ్వడం లేదని రోడ్డు మీదకు..
చెన్నైలో రోడ్డుపై ధర్నాకు దిగారు కరోనా పేషెంట్స్. మంకాడు ముత్తుకుమారన్ మెడికల్ కాలేజీలో తమకు ఎలాంటి ప్రాథమిక సదుపాయాలు కల్పించలేదని రోడ్డు మీదకొచ్చేశారు కోవిడ్ బాధితులు. తాగునీరు, ఆహారం, చికిత్స సరిగ్గా ఇవ్వడం లేదని రోడ్డు మీదకు వచ్చి ధర్నా చేపట్టారు కరోనా రోగులు. అయితే ఒక్కసారిగా కరోనా రోగులు రోడ్డు మీదకు రావడంతో.. అక్కడున్న కొంత మంది స్థానికులు భయంతో పారిపోయారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు.. రంగంలోకి దిగి కోవిడ్ బాధితులకు సర్ది చెప్పారు. దీంతో ఆందోళన విరమించి మళ్లీ క్వారంటైన్ సెంటర్లోకి వెళ్లారు కరోనా పేషెంట్లు.
కాగా ప్రస్తుతం తమిళనాడు వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. రోజు రోజుకీ కొత్త కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. ఇక దేశ వ్యాప్తంగా ఉన్న కరోనా కేసుల లిస్టులో తమిళనాడు రాష్ట్రం రెండొవ స్థానంలో ఉంది. ప్రస్తుతం ఆ రాష్ట్ర వ్యాప్తంగా 1,92,964 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదుకాగా, ఇప్పటి వరకూ 3,232 మంది మరణించారు. ఇక 52,939 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే 1,36,793 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
Read More:
ఏపీలోని ఈ మూడు జిల్లాల్లోనే అత్యధిక కరోనా కేసులు..