AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోకుల్ చాట్ పేలుళ్ల నేపథ్యంలో నాగార్జున ‘వైల్డ్ డాగ్’.!

తన తాజా చిత్రం ‘మన్మథుడు 2’ ప్లాప్‌తో అక్కినేని నాగార్జున కొంతకాలం కమర్షిషియల్ సినిమాలకు దూరంగా ఉండాలనుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే నాగ్ రైటర్ టర్డ్న్  డైరెక్టర్ సోలోమెన్ డైరెక్షన్‌లో  ‘వైల్డ్ డాగ్’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.  ఆసక్తికరమైన విషయం ఏంటంటే..ఈ చిత్రం హైదారాబాద్‌లోని  గోకుల్ చాట్, లుంబిని పార్క్‌లలో 2008లో జరిగిన జంట పేలుళ్ల నేపథ్యంలో తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. . ఎన్‌ఐఏ కోసం పనిచేసే ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రలో నాగ్ కనిపించనున్నారట. అప్పట్లో దేశాన్ని […]

గోకుల్ చాట్ పేలుళ్ల నేపథ్యంలో నాగార్జున 'వైల్డ్ డాగ్'.!
Ram Naramaneni
|

Updated on: Mar 02, 2020 | 9:39 PM

Share

తన తాజా చిత్రం ‘మన్మథుడు 2’ ప్లాప్‌తో అక్కినేని నాగార్జున కొంతకాలం కమర్షిషియల్ సినిమాలకు దూరంగా ఉండాలనుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే నాగ్ రైటర్ టర్డ్న్  డైరెక్టర్ సోలోమెన్ డైరెక్షన్‌లో  ‘వైల్డ్ డాగ్’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.  ఆసక్తికరమైన విషయం ఏంటంటే..ఈ చిత్రం హైదారాబాద్‌లోని  గోకుల్ చాట్, లుంబిని పార్క్‌లలో 2008లో జరిగిన జంట పేలుళ్ల నేపథ్యంలో తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. .

ఎన్‌ఐఏ కోసం పనిచేసే ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రలో నాగ్ కనిపించనున్నారట. అప్పట్లో దేశాన్ని కదిలించిన జంట పేలుళ్ల కేసును గుర్తించి పరిష్కరించడానికి నియమించిన ప్రధాన అధికారిగా ఆయన కనిపిస్తారని ఫిల్మ్ వర్గాల నుంచి సమాచారం. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ డియా మీర్జా నాగార్జున భార్య పాత్రలో నటిస్తుండగా, ‘రేయ్’ మూవీ ఫేమ్ సయామి ఖేర్ హీరోతో పాటు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ముంబైలో షూటింగ్ ముగిసిన అనంతరం, చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో గోకుల్ చాట్, లుంబినీ పార్క్ సెట్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Follow Us