‘అఖిల్ 5వ’ సినిమాకు హీరోయిన్ ఫిక్స్.. అక్కినేనితో జతకట్టనున్న ఆ మోడల్ ?.. త్వరలోనే షూటింగ్..

అక్కినేని అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చిత్రీకరణలో పాల్గొంటూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో అఖిల్‏కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది.

'అఖిల్ 5వ' సినిమాకు హీరోయిన్ ఫిక్స్.. అక్కినేనితో జతకట్టనున్న ఆ మోడల్ ?.. త్వరలోనే షూటింగ్..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 30, 2020 | 1:46 PM

అక్కినేని అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చిత్రీకరణలో పాల్గొంటూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో అఖిల్‏కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావోస్తున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. ఈ సినిమా తర్వాత అఖిల్ 5 అనే సినిమాలో నటించబోతున్నాడు ఈ యంగ్ హీరో. ఈ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నాడు. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతుంది. కానీ ఇప్పటి వరకు ఈ సినిమాలో అఖిల్ సరసన నటించే హీరోయిన్ పేరు మాత్రం తెలియలేదు.

తాజా సమాచారం ప్రకారం మోడల్ కమ్ హీరోయిన్ సాక్షి వైధ్య నటించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫోటో షూట్ చేయడంతోపాటు.. టెస్ట్ షూటింగ్‏లో కూడా పాల్గొందంట ఈ ముద్దుగుమ్మ. దర్శకుడు సురేందర్ రెడ్డి అఖిల్ 5 సినిమా కోసం సాక్షి వైధ్య సరిగ్గా సరిపోతుందని.. తనను ఎంపిక చేశారని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పని పూర్తైన వెంటనే చిత్రీకరణ ప్రారంభించాలని భావిస్తున్నారట. ఇండియన్ జేమ్స్ బాండ్ సినిమాలాగే ఈ సినిమా కూడా ఉంటుందని.. ఇందులో అఖిల్ స్పై గా కనిపించనున్నట్లు సమాచారం.