AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన హైబ్రిడ్ పిల్ల..కానీ ఒక విషయంలో మాత్రం ఈ అమ్మడు..

ఫిదా సినిమాలో హైబ్రిడ్ పిల్లగా నటించి అందరి మనసులను దోచేసుకుంది హీరోయిన్ సాయి పల్లవి. సినిమాలోని ఈ పాత్ర ద్వారా ఎంతోమంది

రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన హైబ్రిడ్ పిల్ల..కానీ ఒక విషయంలో మాత్రం  ఈ అమ్మడు..
uppula Raju
|

Updated on: Dec 20, 2020 | 12:01 AM

Share

ఫిదా సినిమాలో హైబ్రిడ్ పిల్లగా నటించి అందరి మనసులను దోచేసుకుంది హీరోయిన్ సాయి పల్లవి. సినిమాలోని ఈ పాత్ర ద్వారా ఎంతోమంది ఫ్యాన్స్‌ని సంపాదించుకుంది ఈ అమ్మడు. తన నటనతో విమర్శకులను సైతం మెప్పించగలిగింది. దీంతో సాయి పల్లవికి మంచి మంచి ఆపర్‌లు వచ్చాయి. అతి తక్కువ సమయంలోనే ఓవర్ నైట్ స్టార్‌డమ్ తెచ్చేసుకుంది.

అయితే తాజాగా ఈ అమ్మడు తన రెమ్యునరేషన్ పెంచేసిందని వార్తలు వినబడుతున్నాయి. తెలుగు, తమిళం, మలయాళంలో సినిమా ఆఫర్‌లు వస్తుండటంతో ప్రస్తుతం బిజీగా అయిపోయింది. తాజాగా ఆమె నటించిన వెబ్ ఫిల్మ్ పావ కథైగల్ విడుదలైంది. ప్రకాశ్ రాజ్ కూతురుగా ఇందులో నటించింది సాయి పల్లవి. గర్భవతి పాత్రలో కనిపించింది. పావ కథైగల్‌తో మరోసారి హీరోయిన్ హాట్ టాపిక్ అయిపోయింది. తెలుగులో కూడా విరాట పర్వంతో పాటు లవ్ స్టోరీ.. శ్యామ్ సింగ రాయ్ సినిమాల్లో నటిస్తోంది. సాయి పల్లవి ఒక్కో సినిమాకు కోటిన్నర తీసుకుంటుందని ప్రచారం జరుగుతోంది. అలాగని పారితోషికం కోసం పట్టింపు ఉన్న హీరోయిన్ కాదు. అప్పట్లో ఓ సినిమా కోసం కోటి పాతిక లక్షలు అడిగిన ఆమె సినిమా ఫ్లాప్ కావడంతో 40 లక్షలు తిరిగి నిర్మాతలకు ఇచ్చేసిందని ఇండస్ట్రీలో టాక్