AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘అయ్యప్పనమ్ కోషియమ్’ రీమేక్ నుంచి తప్పుకున్న దగ్గుబాటివారబ్బాయి.. అసలు కారణం అదేనా.?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా సినిమాలను ఒకే చేస్తున్నారు. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా చివరి దశలో ఉంది. ఈ సినిమా ఆతరువాత క్రిష్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నారు.

'అయ్యప్పనమ్ కోషియమ్' రీమేక్ నుంచి తప్పుకున్న దగ్గుబాటివారబ్బాయి.. అసలు కారణం అదేనా.?
Rajeev Rayala
|

Updated on: Dec 20, 2020 | 4:34 PM

Share

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా సినిమాలను ఒకే చేస్తున్నారు. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా చివరి దశలో ఉంది. ఈ సినిమా ఆతరువాత క్రిష్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నారు. ఆసినిమా తరవాత గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్‌తో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతోపాటు మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనమ్ కోషియమ్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తన్నారు. అయితే ఈ సినిమాలో పవన్‌తోపాటు దగ్గుబాటివారబ్బాయి రానా నటిస్తున్నారని గతకొంతకాలంగా ప్రచారం జరుగుతుంది.

సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. బిజూ మీనన్ పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కనిపించనుండగా..పృథ్వీరాజ్ నటించిన పాత్రలో రానా కనిపిస్తారని అంటున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి రానా బయటకు వచేసారని ఫిలింనగర్లో టాక్ నడుస్తుంది. ఈ రీమేక్‌లో కొన్నిమార్పులు చేర్పులు చేశారట నిజానికి ఒరిజినల్‌లో ఇద్దరు హీరోల పాత్రలు సమానంగా ఉంటాయి. కానీ తెలుగులో పవన్ పాత్రను కాస్త హైలైట్ చేస్తూ రానా పాత్రను కొంచం తగ్గించారట. అది నచ్చకే రానా ప్రాజెక్ట్ కు నో చెప్పాడని టాక్. దాంతో మరో హీరోను వెతికే పనిలోపడ్డారట దర్శకనిర్మాతలు. మరి ఈవార్తల్లో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది.