AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డబ్బింగ్ ఆర్టిస్ట్‌కి సారీ చెప్పిన రాశీఖన్నా..!

హీరోయిన్ రాశీఖన్నా ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్‌కి సారీ చెప్పారు. రాశీఖన్నా ఇటీవలే ‘అయోగ్య’ అనే సినిమాలో నటించారు. ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన టెంపర్ చిత్రానికి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రానికి మురుగదాస్ శిష్యుడు వెంకట్ మోహన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో విశాల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించి అలరించాడు. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా తమిళ తంబీలని ఆకట్టుకుంటోంది. అయితే.. ఈ సినిమా పూర్తయ్యాక వచ్చే ఎండ్ టైటిల్స్‌లో వాయిస్ ఆర్టిస్టులకు క్రెడిట్స్ ఇవ్వలేదు. […]

డబ్బింగ్ ఆర్టిస్ట్‌కి సారీ చెప్పిన రాశీఖన్నా..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 18, 2019 | 3:32 PM

Share

హీరోయిన్ రాశీఖన్నా ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్‌కి సారీ చెప్పారు. రాశీఖన్నా ఇటీవలే ‘అయోగ్య’ అనే సినిమాలో నటించారు. ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన టెంపర్ చిత్రానికి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రానికి మురుగదాస్ శిష్యుడు వెంకట్ మోహన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో విశాల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించి అలరించాడు. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా తమిళ తంబీలని ఆకట్టుకుంటోంది.

అయితే.. ఈ సినిమా పూర్తయ్యాక వచ్చే ఎండ్ టైటిల్స్‌లో వాయిస్ ఆర్టిస్టులకు క్రెడిట్స్ ఇవ్వలేదు. దీనిపై డబ్బింగ్ ఆర్టిస్ట్ రవీనా తన ట్విట్టర్ ద్వారా ఆవేదన వ్యక్తం చేసింది. సినిమా టైటిల్స్‌లో మా కేటగిరీకి క్రెడిట్స్ ఇవ్వకపోవడం చాలా బాధ కలిగిస్తోందని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌పై స్పందించిన రాశీ ఖన్నా.. నన్ను క్షమించు రవీనా.. స్క్రీన్‌ మీద నన్ను ఎలివేట్ చేయడానికి నీ అందమైన గొంతు ఇచ్చిన మీకు ప్రత్యేక కృతజ్ఞతలు అని పేర్కొంది. ఇందుకు రవీనా స్పందించి.. ఇది మీ తప్పు కాదు. మీకు డబ్బింగ్‌ చెప్పినందుకు సంతోషంగా ఉంది’ అని రీట్వీట్‌ చేశారు.