AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఆ అమ్మాయిలందరూ ఏమైపోయారు? టాప్ ట్రెండింగ్‌లో థ్రిల్లర్ సిరీస్.. ఐఎమ్‌డీబీలోనూ టాప్ రేటింగ్

1998 ఆంధ్రప్రదేశ్ లోని ఓ మారుమూల గ్రామంలో జరిగే సంఘటనల ఆధారంగా ఈ క్రైమ్ సిరీస్ ను తెరకెక్కించారు. బ్లాక్ మ్యాజిక్, మూఢనమ్మకాలు, అమ్మాయిల మిస్సింగ్ మిస్టరీ అంశాలతో తెరకెక్కిన ఈ సిరీస్ ఆడియెన్స్ కు మంచి టైమ్ పాస్ అని చెప్పవచ్చు.

OTT Movie: ఆ అమ్మాయిలందరూ ఏమైపోయారు? టాప్ ట్రెండింగ్‌లో థ్రిల్లర్ సిరీస్.. ఐఎమ్‌డీబీలోనూ టాప్ రేటింగ్
Ott Movie
Basha Shek
|

Updated on: Aug 16, 2025 | 9:09 PM

Share

ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు ప్రస్తుతం వివిధ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో అందుబాటులో ఉన్నాయి. అలా ఈ వారం స్ట్రీమింగ్ కు వచ్చిన ఓ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ ఓటీటీ ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకుంటోంది. సస్పెన్స్, డ్రామా, హారర్, థ్రిల్లింగ్.. ఇలా అన్నీ ఆంశాలు ఉండడంతో ఈ సిరీస్ కు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఐఎమ్‌డీబీలోనూ ఈ థ్రిల్లింగ్ సిరీస్ కు పదికి 7.5 రేటింగ్ రావడం విశేషం. ఈ సిరీస్ విషయానికి వస్తే.. 1998లో శ్రీకాకుళం జిల్లాలోని రేపల్లె గ్రామంలో ఈ కథ సాగుతుంది. ఈ గ్రామంలోని అమ్మాయిలు వరుసగా అదృశ్యమవుతుంటారు. మరీ ముఖ్యంగా రాత్రి సమయంలో ఊరికి దూరంగా అడివిగుట్ట వైపు వెళ్లే యువతులందరూ కనిపించకుండా పోతారు. దీంతో గ్రామస్తులందరూ భయపడిపోతారు. అసలు అమ్మాయిలందరూ ఏమైపోయారు? గ్రామంలో ఎందుకిలా జరుగుతోంది? అన్న మిస్టరీని ఛేదించేందుకు ఒక లేడీ కానిస్టేబుల్ రేపల్లెకు వస్తుంది. అయితే పోలీసమ్మ బల్లిని చూస్తేనే భయపడేరకం. మరి అలాంటి పోలీసమ్మ అమ్మాయిల మిస్సింగ్ కేసును ఎలా సాల్వ్ చేసింది? ప్రయాణంలో ఆమెకు తెలిసిన సంచలన విషయాలు ఏంటి? కనిపించకుండా పోయిన అమ్మాయిలందరూ ఏమైపోయారు? దీని వెనక ఉన్నది ఎవరు? అన్న ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే థ్రిల్లింగ్ సిరీస్ ను చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

బ్లాక్ మ్యాజిక్, అమ్మాయిల మిస్సింగ్ మిస్టరీతో తెరకెక్కిన రూరల్ బ్యాక్ డ్రాప్ సిరీస్ పేరు కానిస్టేబుల్ కనకం. హీరోయిన్ వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సిరీస్ లో అవసరాల శ్రీనివాస్, రాజీవ్ కనకాల తదితరులు ప్రధాన పాత్రలు పోషించారుప్రశాంత్ కుమార్ ఈ సిరీస్ కు దర్శకత్వం వహించగా, కోవెలమూడి సత్యసాయిబాబా, వేటూరి హేమంత్ కుమార్ సంయుక్తంగా ఈ సిరీస్ ను నిర్మించారు.

గురువారం (ఆగస్టు 14) నుంచి ఈటీవీ విన్ లో కానిస్టేబుల్ కనకం సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి ఓటీటీ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. క్రమంలో స్ట్రీమింగ్ కు వచ్చిన మొదటి రోజు నుంచే ఈటీవీ విన్ సినిమాల్లో టాప్ వన్ ప్లేస్ లో కొనసాగుతోంది కానిస్టేబుల్ కనకం.

ఈటీవీ విన్ లో కానిస్టేబుల్ కనకం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Jailer2: రజనీ మాస్ ఎంటర్‌టైనర్‌లో ఆ బ్యూటీకి స్పెషల్ సాంగ్ ఛాన్స్
Jailer2: రజనీ మాస్ ఎంటర్‌టైనర్‌లో ఆ బ్యూటీకి స్పెషల్ సాంగ్ ఛాన్స్
రష్మిక సీక్రెట్ పార్టీలో.. ఆ 'మిస్టరీ బ్యూటీ'! ఎవరు?
రష్మిక సీక్రెట్ పార్టీలో.. ఆ 'మిస్టరీ బ్యూటీ'! ఎవరు?
ఏపీలో విజృంభిస్తున్న స్క్రబ్ టైఫస్.. 15కు చేరిన మృతుల సంఖ్య!
ఏపీలో విజృంభిస్తున్న స్క్రబ్ టైఫస్.. 15కు చేరిన మృతుల సంఖ్య!
100 కోట్లు టు 1000 కోట్లు.. రికార్డులను తిరగరాస్తున్న టాలీవుడ్
100 కోట్లు టు 1000 కోట్లు.. రికార్డులను తిరగరాస్తున్న టాలీవుడ్
20 సిక్సర్లు, 24 ఫోర్లతో డబుల్ సెంచరీ.. దుమ్మురేపిన బుడ్డోడు
20 సిక్సర్లు, 24 ఫోర్లతో డబుల్ సెంచరీ.. దుమ్మురేపిన బుడ్డోడు
తన సామాజిక వర్గంపై తొలిసారి నోరు విప్పిన నటి.. నెట్టింట చర్చ!
తన సామాజిక వర్గంపై తొలిసారి నోరు విప్పిన నటి.. నెట్టింట చర్చ!
23 ఏళ్లుగా ఇండస్ట్రీలో తోపు.. చేసింది 7 సినిమాలే..
23 ఏళ్లుగా ఇండస్ట్రీలో తోపు.. చేసింది 7 సినిమాలే..
అవమానాల నుంచి 'దురంధర్' గర్జన వరకు.. ఆదిత్య ధర్ కన్నీటి కథ
అవమానాల నుంచి 'దురంధర్' గర్జన వరకు.. ఆదిత్య ధర్ కన్నీటి కథ
Video: యాషెస్ స్నికో వివాదంపై పెదవి విప్పిన అలెక్స్ కేరీ
Video: యాషెస్ స్నికో వివాదంపై పెదవి విప్పిన అలెక్స్ కేరీ
13 సెకన్లలో ఈ రెండు చిత్రాల మధ్య తేడాలను గుర్తిస్తే నువ్వే తోపు
13 సెకన్లలో ఈ రెండు చిత్రాల మధ్య తేడాలను గుర్తిస్తే నువ్వే తోపు