AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: పోలీసులను చంపి కళ్లు, గుండె తీసుకెళ్లే సైకో కిల్లర్.. ఓటీటీలో గుండె దడ పుట్టించే క్రైమ్ థ్రిల్లర్

ఇతర జానర్ సినిమాల కంటే క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు కాస్త ఆసక్తికరంగా ఉంటాయి. ఒక మోటివ్ తో కిల్లర్ ఆధారాలు లేకుండా హత్యలు చేసి సవాల్ విసరడం, పోలీసులు చాక చక్యంగా వాడిని పట్టుకోవడమనేది ఈ తరహా సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది.

OTT Movie: పోలీసులను చంపి కళ్లు, గుండె తీసుకెళ్లే సైకో కిల్లర్.. ఓటీటీలో గుండె దడ పుట్టించే క్రైమ్ థ్రిల్లర్
OTT Movie
Follow us
Basha Shek

|

Updated on: May 09, 2025 | 3:56 PM

ఇటీవల కాలంలో సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఓటీటీ లో ఈ జానర్ సినిమాలకు బాగా ఆదరణ ఉంటోంది. అందుకు తగ్గట్టుగానే పలు ఓటీటీ సంస్థలు వివిధ భాషల్లో హిట్ అయిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఆయా భాషల్లోకి అనువాదం చేసి స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. ఈ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది.  ఈ సినిమా థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఓటీటీలోనూ ట్రెండ్ అవుతోంది. ఈ సైకో థ్రిల్లర్ సినిమా కథ విషయానికి వస్తే.. మూవీ మొత్తం కొచ్చిన్ చుట్టూ తిరుగుతుంటుంది. నగరంలో పోలీసు అధికారులు ఒకరి తర్వాత ఒకరు దారుణంగా హత్యకు గురవుతుంటారు. ప్రతి హత్యలో చనిపోయిన వారి గుండె, కళ్ళను పీకేస్తుంటాడు కిల్లర్. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే దారుణ హత్యకు గురి కావడంతో నగరంలో భయాందోళనలు మొదలవుతాయి. దీంతో సైకో కిల్లర్ ను ఎలాగైనా పట్టుకోవాలని పోలీస్ ఉన్నతాధికారి రంగంలోకి దిగుతాడు. కన్సల్సింగ్ సైకాలజిస్ట్, హ్యాకర్ సాయంతో ఈ హత్యల వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తారు. అలాగే కిల్లర్ ను పట్టుకునేందుకు ట్రై చేస్తారు. ఇందుకోసం అన్ని రకాల ప్లాన్స్ వేస్తారు. కానీ కిల్లర్ మాత్రం పోలీసుల కంటే ఒక అడుగే ముందుంటాడు. పోలీసుల ప్రణాళికలు ముందే తెలుసుకుని తప్పించుకుంటాడు. మరి సైకో కిల్లర్ మోటివ్ ఏంటి? అసలెందుకు పోలీసులను టార్గెట్ చేశాడు? అతని గతం ఏమిటి ? చివరికి ఆ కిల్లర్ ని పోలీసులు పట్టుకుంటారా ? లేదా అన్నది తెలుసుకోవాలంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూడాల్సిందే.

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న ఈ సినిమా పేరు అంజామ్ పతిరా. 2020 లో విడుదలైన మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఆడియెన్స్ ను థ్రిల్ చేసింది. ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ సినిమాగా నిలిచింది. మిధున్ మాన్యువల్ థామస్ తెరకెక్కించిన ఈ మూవీలో కుంచాకో బోబన్, షరఫ్ యూ ధీన్, శ్రీనాథ్ భాసి, ఉన్నిమాయ ప్రసాద్, జిను జోసెఫ్, అభిరామ్ రాధాకృష్ణన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా సన్ ఎన్ఎక్స్‌టీ , ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్, ఆహా ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ తెలుగు వెర్షన్ అందుబాటులో లేదు కానీ ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో ఈ సినిమాను ఎంజాయ్ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.