OTT: ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైన ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’.. ఎందులో, ఎప్పటి నుంచంటే..

అల్లరి నరేష్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. నాందిలో నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి ప్రేక్షకులకు మెప్పించిన నరేష్‌ కమర్షియల్‌ హంగులకు దూరంగా నటించిన చిత్రం ఇది. ఏఆర్‌ మోహన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా..

OTT: ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైన 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'.. ఎందులో, ఎప్పటి నుంచంటే..
Itlu Maredumilli Prajaneekam
Follow us

|

Updated on: Dec 19, 2022 | 8:41 PM

అల్లరి నరేష్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం‘. నాందిలో నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి ప్రేక్షకులకు మెప్పించిన నరేష్‌ కమర్షియల్‌ హంగులకు దూరంగా నటించిన చిత్రం ఇది. ఏఆర్‌ మోహన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్‌ 25వ తేదీన విడుదలైన మంచి టాక్‌ దక్కించుకుంది. ఈ సినిమాలో నరేష్‌ ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ అధికారిగా అద్భుత నటనను కనబరిచాడు. రాజకీయ వ్యవస్థను ప్రశ్నించడం అనే కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది.

ఇదిలా ఉంటే థియేటర్లలో మెప్పించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైంది. సినిమా విడుదలైన దాదాపు నెల రోజుల తర్వాత ఓటీటీలో విడుదల కానుంది. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 వేదికగా విడుదలవుతోంది. క్రిస్మస్‌ కానుకగా సినిమాను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. డిసెంబర్‌ 23వ తేదీ నుంచి సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన జీ5 వెల్లడించింది. నిజానికి జీ5 తొలుత ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరిలో స్ట్రీమింగ్ చేయనున్నారని వార్తలు వచ్చాయి. అయితే అనుకున్న సమయానికంటే ముందుగానే సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!