
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. గేమ్ ఛేంజర్ లాంటి డిస్సప్పాయింట్ సినిమా తర్వాత చరణ్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. అంతేకాదు బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండటంతో ఆ అంచనాలు తారా స్థాయికి చేరాయి. ఉప్పెన లాంటి లవ్ స్టోరీతో వందకోట్లకు పైగా రాబట్టిన బుచ్చిబాబు.. ఇప్పుడు పెద్ది సినిమాతో బాక్సాఫీస్ ను ఎలా షేక్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఈ సినిమా నుంచి ట్రైలర్ ను నేడు విడుదల చేయనున్నారు.
ఈ సినిమా ట్రైలర్ కోసం మెగా ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ రోజు (18న ) ట్రైలర్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు మేకర్స్. ఈ సినిమాలో చరణ్ కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుంది. అలాగే శివరాజ్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అదేవిధంగా మరికొంతమంది స్టార్ నటులు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ పోస్టర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా పెద్ది సినిమానా సెన్సార్ పూర్తి చేసుకుందని తెలుస్తుంది. కాగా పెద్ది సినిమా రన్ టైం ఏకంగా 3 గంటల 9 నిముషాలు ఉందని తెలుస్తుంది. ఏకంగా ఈ సినిమా ఏకంగా 189 నిమిషాల రన్ టైం తో సాగనుంది. అలాగే గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన పెద్ది సినిమాలో ఎమోషన్స్, యాక్షన్ సీన్స్ సినిమాకే హైలెట్ గా ఉండనున్నాయట.. ముఖ్యంగా చరణ్ తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయం అంటున్నారు. విజయనగరం యాసలో చరణ్ చెప్పే డైలాగ్స్, ఆయన ఊర మాస్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని తెలుస్తుంది. ముఖ్యంగా క్రికెట్, రెజ్లింగ్ సీన్స్ ముఖ్యంగా ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తాని అంటున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ ను ఎలా షేక్ చేస్తుందో చూడాలి.