‘మెగా’ సంక్రాంతి.. ఫ్రేమ్‌లో అకీరా.. ఆ ఇద్దరు మిస్..!

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు కొనసాగుతున్నాయి. సామాన్యులను మొదలుకొని సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు సంక్రాంతి పండుగను సంబరంగా జరుపుకుంటున్నారు. ఇక మెగా ఫ్యామిలీలోనూ సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి. ఫ్యామిలీ అంతా ఒకే చోట చేరి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా మెగా హీరోలందరూ ఓ ఫొటోకు పోజిచ్చారు. ఇక ఆ ఫొటోను వరుణ్‌తేజ్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అందులో మెగాస్టార్ చిరంజీవితో సహా యంగ్ హీరోలైన రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ […]

'మెగా' సంక్రాంతి.. ఫ్రేమ్‌లో అకీరా.. ఆ ఇద్దరు మిస్..!
Follow us

| Edited By:

Updated on: Jan 15, 2020 | 2:44 PM

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు కొనసాగుతున్నాయి. సామాన్యులను మొదలుకొని సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు సంక్రాంతి పండుగను సంబరంగా జరుపుకుంటున్నారు. ఇక మెగా ఫ్యామిలీలోనూ సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి. ఫ్యామిలీ అంతా ఒకే చోట చేరి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా మెగా హీరోలందరూ ఓ ఫొటోకు పోజిచ్చారు. ఇక ఆ ఫొటోను వరుణ్‌తేజ్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అందులో మెగాస్టార్ చిరంజీవితో సహా యంగ్ హీరోలైన రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్, కల్యాణ్‌దేవ్‌లు ఉన్నారు. వారితో పాటు పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ ‌కూడా ఫ్యామిలీ సంబరాల్లో పాలు పంచుకున్నారు. అయితే ఈ ఫ్రేమ్‌లో ఈ సారి పవన్, నాగబాబు ఇద్దరూ మిస్ అయ్యారు. ఏదేమైనా మెగా హీరోలందరినీ ఒకేచోట చూసిన అభిమానులు మాత్రం ఆ ఫొటోను షేర్ చేస్తూ.. వావ్.. సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.