Mani Ratnam : ‘పొన్నియిన్ సెల్వన్’ కోసం భారీ మొత్తాన్ని ఆఫర్ చేసిన ప్రముఖ డిజిటల్ సంస్థ..?

స్టార్ డైరెక్టర్ మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'పొన్నియిన్ సెల్వన్' అనౌన్స్ చేసిన దగ్గరనుంచి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. భారీ తారాగణంతో..

Mani Ratnam : 'పొన్నియిన్ సెల్వన్' కోసం భారీ మొత్తాన్ని ఆఫర్ చేసిన ప్రముఖ డిజిటల్ సంస్థ..?
Follow us

|

Updated on: Jan 13, 2021 | 4:58 PM

Mani Ratnam : స్టార్ డైరెక్టర్ మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’ అనౌన్స్ చేసిన దగ్గరనుంచి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. భారీ తారాగణంతో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఈ చిత్రంలో ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష కృష్ణన్, విక్రమ్, జయం రవి, కార్తీ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారని తెలుస్తుంది. ఐశ్వర్య రాయ్ బచ్చన్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారని అంటున్నారు. ప్రస్తుతంఈ సినిమా  షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఇప్పటికే ప్రధాన షూటింగ్ థాయిలాండ్ లో పూర్తయింది. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది.

ఈ నెల 6నుంచి హైదరాబాద్ లోని రామోజీఫిలిం సిటీలో ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యింది.ఈ సినిమాకోసం ఫిలిం సిటీలో భారీ సెట్ ను నిర్మిస్తున్నారట. ఈ చిత్రానికి తోట్టా తరణి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తుండగా.. ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. హైదరాబాద్ షెడ్యూల్ రెండు నెలల పాటు కొనసాగుతుందని తెలుస్తుంది ఈ చిత్రంలోని ప్రధాన సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో పూర్తి చేయాలని బృందం యోచిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ప్రముఖ డిజిటల్ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ఆఫర్  ఇచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. స్ట్రీమింగ్ హక్కుల కోసం భారీ మొత్తాన్ని ఆఫర్ చేసిందట సదరు సంస్థ. ఇప్పుడు ఈ వార్త తెగ చక్కర్లు కొడుతుంది. మరి ఈ సినిమా ఓటీటీవేదికగా విడుదల అవుతుందా..? లేక థియేటర్స్ లో రిలీజ్ అవుతుందో తెలియాల్సి ఉంది. .

 మరిన్ని ఇక్కడ చదవండి : 

Uppena Movie Teaser: ‘ఉప్పెన’ టీజర్ రివ్యూ: ”ఈ ఒక్క రాత్రీ.. 80 సంవత్సరాలు గుర్తిండిపోయేలా బ్రతికేద్దాం..”

Janhvi Kapoor : బెల్లీ డాన్స్‌‌‌‌తో అదరగొట్టిన జాన్వీ కపూర్.. సోషల్ మీడియాలో వీడియో హల్‌‌‌‌‌‌‌‌చల్..