Assembly Election Voting 2026 Live: మూడు రాష్ట్రాల్లో కొనసాగుతున్న పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే..?
Kerala, Puducherry, Assam Elections 2026 Voting Live Updates: కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాజకీయ ముఖచిత్రం ఇప్పుడు ఒక కీలక మలుపు వద్ద ఉంది. ఈ మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమవ్వగా.. ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. అస్సాంలో మరోసారి గెలుపు తమదేనని బీజేపీ ధీమాగా ఉండగా.. కాంగ్రెస్ కేరళపై గంపెడాశలు పెట్టుకుంది.

LIVE NEWS & UPDATES
-
ఓటర్లకు రోబో స్వాగతం
- పుదుచ్చేరిలో కొనసాగుతున్న పోలింగ్
- వీఓసీ స్కూల్ పోలింగ్ బూత్లో నీలా అనే రోబో సందడి
- ఓటర్లకు స్వాగతం పలుకుతున్న నీలా రోబో
#WATCH | Puducherry Elections 2026 | A robot, Nila welcomes voters arriving at VOC Govt School to exercise their franchise. https://t.co/0nisPCPdhr pic.twitter.com/HMZoKuQJnf
— ANI (@ANI) April 9, 2026
-
మొరాయించిన ఈవీఎంలు
- కేరళలో పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు
- పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరిన ఓటర్లు
- పెరంబ్రాలోని 90, 91 బూత్లలో విద్యుత్ అంతరాయంతో నిలిచిన పోలింగ్
- పెరింగోడ్ హైస్కూల్లో గల 178వ నంబరు బూత్లో పనిచేయని ఈవీఎం
-
-
బీజేపీ బూత్ ఏజెంట్పై దాడి
- కేరళం మట్టనూర్ మలూరులో బీజేపీ బూత్ ఏజెంట్పై రాళ్ల దాడి ఆరోపణలు
- సీపీఎం సభ్యులే రాళ్లు విసిరారని బీజేపీ ఆరోపణ
- ఈ ఘటనలో మనోలి షైజు అనే వ్యక్తికి గాయాలు
-
ఆ కూటమిల మధ్య హోరాహోరీ
-
- పుదుచ్చేరిలో నాలుగు కూటమిల మధ్య హోరాహోరీ
- ఎన్ఆర్ కాంగ్రెస్ నేతృత్వంలోని తేజ కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి..
- నామ్ తమిళర్ పార్టీ, టీవీకే పార్టీ మధ్య ప్రధాన పోరు
-
-
ప్రారంభమైన పోలింగ్..
- కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ప్రారంభమైన పోలింగ్..
- కేరళలో 140 స్థానాలు, అస్సాంలో 126, పుదుచ్చేరిలో 30 స్థానాలకు పోలింగ్
-
కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. గత కొన్ని వారాలుగా సాగిన ప్రచారపర్వానికి ఇప్పటికే ఎండ్ కార్డ్ పడగా.. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈసారి కేరళ ఎన్నికల బరిలో ప్రధానంగా మూడు కూటములు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. సీఎం పినరయి విజయన్ నాయకత్వంలో వరుసగా మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకుని రికార్డు సృష్టించాలని ఎల్డీఎఫ్ చూస్తోంది. సుపరిపాలన – సంక్షేమ పథకాలే తమకు శ్రీరామరక్ష అని ఎల్డిఎఫ్ నమ్ముతోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ ఈసారి ఎలాగైనా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. ఇందిరా గ్యారెంటీలు వంటి వాగ్దానాలతో ఓటర్లను ఆకర్షిస్తోంది. ఎన్డీఏ, ఈసారి కేరళలో బలమైన ముద్ర వేయాలని చూస్తోంది. రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయంగా ఎదగడమే లక్ష్యంగా ప్రచారం నిర్వహించింది. అస్సాంలో మరోసారి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డింది. రాష్ట్రవ్యాప్తంగా జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించింది.
పోలింగ్ సరళిపైనే అందరి కళ్లు
కేరళలో పెన్షన్ల పెంపు, ఉచిత వైద్యం వంటి అంశాలు ఓటర్ల మనసు గెలుచుకోవడంలో కీలకం కానున్నాయి. పెరుగుతున్న నిరుద్యోగం, యువత వలసల అంశం ఈసారి ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారింది. మెట్రో విస్తరణ, విజింజం పోర్ట్ అభివృద్ధి వంటి ప్రాజెక్టులపై పార్టీల మధ్య హామీల యుద్ధం సాగింది. కాగా 2021 ఎన్నికల్లో 74.06 శాతం పోలింగ్ నమోదవ్వగా, ఈసారి ఆ శాతం పెరుగుతుందో లేదో అన్నది ఆసక్తికరంగా మారింది. పోలింగ్ శాతంలో వచ్చే స్వల్ప మార్పులు కూడా ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ముందస్తు సర్వేలు ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యాన్ని ఇవ్వకపోవడంతో, సామాన్య ఓటరు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
Published On - Apr 09,2026 7:03 AM




