AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అర్ధరాత్రి ముంబై రోడ్లపై భారీ యంత్రాల కవాతు.. భారత్ చేరుకున్న భారీ మెషీన్లు..!?

ముంబై బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌లో కీలక ముందడుగు పడింది. భారతదేశపు తొలి సముద్రగర్భ సొరంగం నిర్మాణం కోసం చైనా నుండి వచ్చిన భారీ TBM యంత్రాలను అర్ధరాత్రి రహస్యంగా తరలించారు. ముంబై పోర్ట్ నుండి BKC వరకు 100 చక్రాల ట్రైలర్‌లతో, పగటి ట్రాఫిక్ లేకుండా ఈ ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. ఇది ప్రాజెక్ట్‌పై ప్రభుత్వ నిబద్ధతను చాటుతూ, భారతీయ రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది.

అర్ధరాత్రి ముంబై రోడ్లపై భారీ యంత్రాల కవాతు.. భారత్ చేరుకున్న భారీ మెషీన్లు..!?
Tbm Machine Transport Mumbai
Jyothi Gadda
|

Updated on: Apr 09, 2026 | 10:35 AM

Share

ముంబై నగరం నిద్రపోతున్న వేళ, రోడ్లపై ఒక భారీ ఆపరేషన్ జరిగింది. బుల్లెట్ రైలు ప్రాజెక్టులో భాగంగా నిర్మించబోయే దేశపు మొట్టమొదటి సముద్రగర్భ సొరంగం కోసం చైనా నుండి వచ్చిన టన్నెల్ బోరింగ్ మెషీన్లను (TBMs) వాటి గమ్యస్థానానికి చేర్చడానికి ఇంజనీర్లు అర్ధరాత్రిని ఎంచుకున్నారు. ఎందుకంటే.. ఈ యంత్రాలు పరిమాణంలో చాలా పెద్దవి. బరువులో అత్యంత భారీవి. వీటిని ముంబై పోర్టు నుండి బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (BKC) వరకు తరలించడం సామాన్యమైన విషయం కాదు. పగటిపూట ముంబై ట్రాఫిక్‌లో వీటిని తరలించడం అసాధ్యం కాబట్టి, అర్ధరాత్రి 12 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల మధ్య ఈ ప్రక్రియను పూర్తి చేశారు.

ఈ భారీ యంత్రాలను మోయడానికి 100 కంటే ఎక్కువ చక్రాలు ఉన్న భారీ మల్టీ-యాక్సిల్ ట్రైలర్లను ఉపయోగించారు. మెషీన్లు వెళ్లే మార్గంలో తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను, కేబుల్స్‌ను తాత్కాలికంగా తొలగించారు. ట్రాఫిక్ పోలీసుల సహకారంతో ఆయా మార్గాలను పూర్తిగా ఖాళీ చేయించారు. ప్రతి మలుపు వద్ద మెషీన్ సురక్షితంగా తిరగడానికి ఇంజనీర్లు ముందుగానే లెక్కలు వేసి సిద్ధంగా ఉన్నారు.

Mega Engineering Operation

ఇవి కూడా చదవండి

ఈ యంత్రాలు ఇప్పుడు బి.కె.సి (BKC) వద్ద ఉన్న లాంచింగ్ షాఫ్ట్‌కు చేరుకున్నాయి. అక్కడ వీటిని అసెంబ్లీ చేసి, తవ్వకం పనులు ప్రారంభిస్తారు. 21 కిలోమీటర్ల పొడవైన ఈ సొరంగం తవ్వకంలో ఇవి కీలక పాత్ర పోషించనున్నాయి. ముఖ్యంగా థానే క్రీక్ వద్ద సముద్రం అడుగున 7 కిలోమీటర్ల మేర సొరంగం చేయడానికి ఇవే ప్రధాన ఆధారం. నగరవాసులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అత్యంత రహస్యంగా, వేగంగా జరిగిన ఈ ఆపరేషన్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చాటిచెబుతోంది. ఈ మెషీన్లు తవ్వకం మొదలుపెడితే, భారతీయ రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలవుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us