AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి.. షాక్ లో తల్లి..!

రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి.. షాక్ లో తల్లి..!

Phani CH
|

Updated on: Apr 08, 2026 | 6:21 PM

Share

హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థులు శివ, సందీప్ మృతి చెందారు. మద్యం మత్తులో కారు నడిపిన డ్రైవర్ ఢీకొనడంతో ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. తల్లిదండ్రులకు భారం కాకూడదని డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న శివ మృతితో అతని తల్లి తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్, వనస్థలిపురం పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మరణించారు. శివ (20) మరియు సందీప్ అనే ఈ ఇద్దరు యువకులు రాత్రి 11:30 గంటల సమయంలో ఓంకార్ నగర్‌లో డెలివరీ ఇవ్వడానికి వెళ్లగా, మద్యం మత్తులో కారు నడుపుతున్న ఒక వ్యక్తి వారిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు శివ నల్గొండ జిల్లా, హాలియా మండలం, ఆల్వా గ్రామానికి చెందినవాడు కాగా, సందీప్ మిర్యాలగూడ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందినవాడు. తల్లిదండ్రులకు భారం కాకూడదని బీటెక్ చదువుకుంటూనే డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న శివ మృతితో అతని తల్లిదండ్రులు తీవ్ర శోకంలో మునిగిపోయారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Boat League 2026: రాజమండ్రిలో ఇంటర్నేషనల్ డ్రాగన్ బోట్ లీగ్ 2026

YS Jagan: త్వరలో పాదయాత్ర ప్రారంభం

YS Jagan : మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపే గ్రోత్‌ కారిడార్‌గా MAVIGUN

విశాఖ రైల్వే జోన్ కల నెరవేరింది.. కానీ ఇప్పడు మరో సమస్య వచ్చి పడింది

మహిళలను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా సైదాబేగం యత్నం

Follow Us