Sarkaru Vaari Paata : మా చిత్రయూనిట్ ఇక్కడ ఎంతో సేఫ్గా ఫీల్ అవుతుందంటున్న సూపర్ స్టార్ మహేష్..
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ భారీ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్, మహేశ్ బాబు సొంతంగా నిర్మిస్తున్నారు.
Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ భారీ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్, మహేశ్ బాబు సొంతంగా నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్ ఈ మూవీలో మహేష్ కు జోడీగా నటిస్తుంది. బ్యాంకింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం భారత బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ ఈ కథ సాగుతుందని సమాచారం.ఈ సినిమా షూటింగ్ ఇటీవలే దుబాయ్ లో ప్రారంభం అయ్యింది. ఇందు కోసం చిత్రయూనిట్ తో పాటు మహేష్ బాబు ఫ్యామిలీ కూడా దుబాయ్ చేసుకున్నారు.
ప్రస్తుతం మహేష్ కీర్తిసురేష్ పై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పై మహేష్ స్పందించారు. దుబాయ్ తనకు చాలా ఇష్టమైన ప్లేస్ అని అన్నారు. గతంలో కూడా ఎన్నోసార్లు నేను దుబాయ్కు వచ్చాను. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ అనుసరిస్తున్న నిబంధనలు చూస్తే మా చిత్రబృందం కూడా ఎంతో సేఫ్గా ఫీల్ అవుతోంది. వచ్చే నెలలో కూడా కొన్నిరోజులపాటు ఈ సినిమా షూట్ ఇక్కడే జరగనుంది’ అని మహేష్ తెలిపారు. ఇక ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సుబ్బరాజులు కీలక పాత్రలో కనిపించన్నారని తెలుస్తుంది. ఇటీవలే సినిమా పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్ మహేష్ చేతిలో తాళాల గుత్తిపట్టుకున్న పోస్టర్ ను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. ఇక మహేష్ ఈ సినిమాలు చాలా డిఫరెంట్ గా కనిపించనున్నాడు.
మరిన్ని ఇక్కడ చదవండి :
టాలీవుడ్లో బిగ్ బాస్ బ్యూటీ హంగామా.. ఏకంగా మహేష్ బాబు సినిమాలో స్పెషల్ సాంగ్ .?