అమెరికా ప్లాన్లో మహేష్ బాబు!
కరోనా రావడంతో ప్రపంచ వ్యాప్తంగా అందరి ప్రణాళికలు తారుమారు అయ్యాయి. ఇక దేశంలో రోజురోజుకు కేసులు పెరుగుతుండటం ఆందోళనను కలిగిస్తున్నప్పటికీ
Mahesh Babu news: కరోనా రావడంతో ప్రపంచ వ్యాప్తంగా అందరి ప్రణాళికలు తారుమారు అయ్యాయి. ఇక దేశంలో రోజురోజుకు కేసులు పెరుగుతుండటం ఆందోళనను కలిగిస్తున్నప్పటికీ.. రికవరీ రేటు ఎక్కువగా ఉండటం కాస్త ఉపశమనాన్ని ఇస్తోంది. ఈ క్రమంలో జాగ్రత్తలు తీసుకుంటూ దాదాపుగా అందరూ పనులను ప్రారంభిస్తున్నారు. ఇక సినిమా వాళ్లు కూడా నిదానంగా సెట్స్ మీదకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు త్వరలోనే షూటింగ్లో జాయిన్ అవుతాడని తెలుస్తోంది.
పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’లో నటించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తొలి షెడ్యూల్ని అమెరికాలో ప్లాన్ చేశారట. ఈ నేపథ్యంలో త్వరలో టీమ్ అమెరికాకు వెళ్లనుందట. దాదాపుగా 30 రోజుల పాటు అక్కడి వాషింగ్టన్ డీసీలో షూటింగ్ జరగనుండగా.. దసరాకు తిరిగి ఇక్కడకు వచ్చేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీలో మహేష్ సరసన తొలిసారి కీర్తి సురేష్ జత కట్టబోతోంది. ఇక మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి థమన్ సంగీతం అందించనున్నారు. మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కబోతున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
Read More: