Covid 19: ‘షేక్హ్యాండ్’పై కీరవాణి సెటైర్లు.. వైరల్ అవుతోన్న పాత వీడియో
ప్రపంచదేశాలను కరోనా వణికిస్తోంది. ప్రాణాంతక వ్యాధిగా చెలరేగిపోతున్న ఈ మహమ్మారికి ఇంకా మందును కూడా కనుగొనలేదు. దీంతో ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తే చాలు ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
ప్రపంచదేశాలను కరోనా వణికిస్తోంది. ప్రాణాంతక వ్యాధిగా చెలరేగిపోతున్న ఈ మహమ్మారికి ఇంకా మందును కూడా కనుగొనలేదు. దీంతో ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తే చాలు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా షేక్ హ్యాండ్ ఇచ్చినా, కౌగలించుకున్నా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉండటంతో.. ఇప్పుడు భారతీయ సంప్రదాయాలవైపు విదేశీయులు చూస్తున్నారు. ఎదురెదురుగా కనిపిస్తే ఒకప్పుడు కరచాలనం చేసుకునే వారు.. ఇప్పుడు చేతులు జోడించి నమస్కారాలు పెట్టుకుంటున్నారు.
ఇదిలా ఉంటే కరోనా కలకలం నేపథ్యంలో కీరవాణి పాడిన ఓ పాత కవిత ఇప్పుడు వైరల్ మారింది. నమస్కారం గొప్పదనాన్ని తెలిపే ఈ కవితను చైతన్య ప్రసాద్ రచించగా.. కీరవాణి పాడారు. వెయ్యి రోగాల పుట్ట ఈ చెయ్యి కనుక.. చాలు చాలు కరచాలనాలు.. దండమెట్టినవేరా ధన్య జీవి అంటూ సాగే ఈ కవితను కీరవాణి అద్భుతంగా చెప్పారు. ముఖ్యంగా మన దైనందిత జీవితంలో చేయి చేసే పనులను ఆయన చెప్పిన తీరు అందరినీ నవ్విస్తూ.. ఆలోచింపజేస్తోంది. ఇక ఈ వీడియోలో రాజమౌళి, ఆయన సతీమణి రమా రాజమౌళి, కుమారుడు కార్తికేయలు కూడా ఉన్నారు.
Read This Story Also: కరోనా అలెర్ట్.. మాస్క్లతో జాగ్రత్త..