COVID 19: కరోనా అలెర్ట్.. మాస్క్లు వాడుతున్నారా.. జర జాగ్రత్త.!
COVID 19: ప్రపంచదేశాలన్నింటినీ కరోనా వైరస్ భయబ్రాంతులకు గురి చేస్తోంది. వుహాన్లో పుట్టిన పెరిగిన ఈ వైరస్ దేశదేశాలకూ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రస్తుతం 89 దేశాలకు పాకిన ఈ మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా 3,356 మంది మృతి చెందారు. భారత్లో సైతం కరోనా కేసులు నమోదు అవుతుండటంతో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే అందరూ మాస్కులు ధరించాలని చెప్పారు. ప్రస్తుతం ఇండియాలో 30 కరోనా కేసులు నమోదయ్యాయి. […]
COVID 19: ప్రపంచదేశాలన్నింటినీ కరోనా వైరస్ భయబ్రాంతులకు గురి చేస్తోంది. వుహాన్లో పుట్టిన పెరిగిన ఈ వైరస్ దేశదేశాలకూ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రస్తుతం 89 దేశాలకు పాకిన ఈ మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా 3,356 మంది మృతి చెందారు. భారత్లో సైతం కరోనా కేసులు నమోదు అవుతుండటంతో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే అందరూ మాస్కులు ధరించాలని చెప్పారు. ప్రస్తుతం ఇండియాలో 30 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇదిలా ఉంటే కొవిడ్ 19 వ్యాప్తి చెందకుండా ఉండేందుకు మాస్కులు ధరించడం ఒక ముఖ్యమైన భాగం. అయితే కేవలం మాస్కుల వల్ల కరోనా వ్యాప్తిని నిరోధించలేమని.. వ్యక్తిగత శుభ్రత చాలా ముఖ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని సూచనలను జారీ చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో తలనొప్పి, జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నవారు మాస్కులను తప్పకుండా ధరించాలని చెప్పింది. అయితే ఈ లక్షణాలు లేనివారు మాత్రం మాస్కులు ధరించాల్సిన అవసరం లేదన్నారు.
మాస్క్ల ద్వారా వైరస్ బారిన పడకుండా ఉన్నట్లు ఎలాంటి దాఖలాలు లేవన్నారు. పైన తెలిపిన లక్షణాలు మీ చుట్టుపక్కల వాళ్లకు ఉన్నా వెంటనే మాస్కులు ధరించాలి. అటు ఊరికే మాస్కులు ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని డబ్ల్యూహెచ్వో స్పష్టం చేసింది. ఇక మాస్క్ను కట్టుకోవడం ఎంత ముఖ్యమో.. దానిని జాగ్రత్తగా పడేయటం అంటే ముఖ్యమని.. ఒకవేళ అలా చేయకపోతే వాటి ద్వారా వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని అంటున్నారు.
మాస్క్లు ధరించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు…
- ముక్కు, నోటి ద్వారా వైరస్ శరీరంలోకి వెళ్లకుండా ఉండేందుకు మాస్క్ పెట్టుకోవడం మంచిదే.
- మాస్క్ పెట్టుకున్నాక పదే పదే ముఖాన్ని తాకకూడదు.
- మాస్క్ను వెనక నుంచి మాత్రమే తీయాలి.
- మాస్క్ తీసేసిన తర్వాత చేతులను సబ్బు లేదా శానిటైజర్తో కడుక్కోవడం తప్పనిసరి.
- ఒకసారి వాడి పడేసిన మాస్కులను మరోసారి ఉపయోగించకూడదు’
For More News:
కరోనా ఎఫెక్ట్.. ఐపీఎల్కు కివీస్ క్రికెటర్లు డుమ్మా.?
ఒక్కొక్కరు ఆరుగురికి జన్మనివ్వండి.. మహిళలకు దేశాధ్యక్షుడి సూచన..!
నేనే దేవుడ్ని.. కరోనా వచ్చింది నా వల్లే.. క్షమించండి..
జగన్ సర్కార్లో సంచైతకు కీలక స్థానం…? ఇంతకీ ఎవరామె..?
హోమియోతో కరోనాకు చెక్.. క్యూ కట్టిన జనాలు