‘విరాటపర్వం’ స్టోరీ లీక్..?

దగ్గుబాటి రానా, సాయి పల్లవి కాంబినేషన్‌లో దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్న చిత్రం ‘విరాటపర్వం 1992’. ఈ చిత్రం రీసెంట్‌గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఎస్.ఎల్.వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియమణి, టబు, మురళీ శర్మ, నానా పటేకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం కథ గురించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో సాయి పల్లవి […]

'విరాటపర్వం' స్టోరీ లీక్..?
Follow us

|

Updated on: Jun 19, 2019 | 3:35 PM

దగ్గుబాటి రానా, సాయి పల్లవి కాంబినేషన్‌లో దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్న చిత్రం ‘విరాటపర్వం 1992’. ఈ చిత్రం రీసెంట్‌గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఎస్.ఎల్.వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియమణి, టబు, మురళీ శర్మ, నానా పటేకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం కథ గురించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ చిత్రంలో సాయి పల్లవి రిపోర్టర్‌గా.. రానా నక్సలైట్‌గా కనిపించనున్నారు. ఓ సందర్భంలో సాయి పల్లవి… రానాను ఇంటర్వ్యూ చేస్తుందని… అప్పుడు రానా ఆమె ప్రేమలో పడి నక్సలిజాన్ని వదిలేస్తాడని తెలుస్తోంది. ఆ తర్వాత ఎలక్షన్స్‌లో కూడా పోటీ చేసి వార్డ్ మెంబర్‌గా గెలుస్తాడట. ఇక హీరో హీరోయిన్ల మధ్య ప్రేమను దర్శకుడు సహజ సిద్ధంగా చూపిస్తాడని టాక్. జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్న ఈ చిత్రంలో అలనాటి బాలీవుడ్ హీరోయిన్ జరీనా వాహబ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.