‘అనగనగా ఒక ధీరుడు’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది శృతిహాసన్. కమల్ హాసన్ కుతురిగా సినీ అరంగేట్రం చేసిన శృతి.. క్రమంగా తన నటనతో టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. సినీ ఇండస్ట్రీలో తండ్రికి బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ.. తన స్వశక్తితోనే ఎదిగింది శృతిహాసన్. మొదట్లో ఐరన్ లేడీగా పేరు తెచ్చుకున్నా.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ సినిమాతో ఫాంలోకి వచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆసినిమా హిట్తో టాలీవుడ్ వరుస ఆఫర్లను అందుకుంది. బలుపు, రేసుగుర్రం, రామయ్య వస్తావయ్యా, ఎవడు, శ్రీమంతుడు, కాటమరాయుడు సినిమాలతో టాలీవుడ్ టాప్ హీరోల సరసన నటించింది ఈ బ్యూటీ. జనవరి 28న శృతిహాసన్ తన 35 పుట్టిన రోజును జరుపుకుంటుంది. ఇటీవల రవితేజ సరసన క్రాక్ మూవీలో నటించి సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది శృతి. అటు పవన్ నటించిన వకీల్ సాబ్ సినిమాలోనూ కనిపించనుంది ఈ అమ్మడు. తాజాగా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న సలార్ సినిమాలోనూ ఛాన్స్ కొట్టేసింది ఈ టాలెంటెడ్ బ్యూటీ..