‘ఎడ్ ఎ మమ్మా’ స్టార్టప్ లాంచ్ చేసిన బాలీవుడ్ టాప్ హీరోయిన్.. పిల్లల కోసమే ప్రత్యేకంగా దుస్తులు..
అతి తక్కువ కాలంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకోని టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది అలియాభట్. తాజాగా ఎంటర్ప్రెన్యూర్ పాత్రలోకి అడుగుపెట్టింది.
అతి తక్కువ కాలంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకోని టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది అలియాభట్. తాజాగా ఎంటర్ప్రెన్యూర్ పాత్రలోకి అడుగుపెట్టింది. 2 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లల దుస్తుల కోసం ‘ఎడ్ ఎ మమ్మా’ అనే స్టార్టప్ లాంచే చేసింది ఈ ముద్దుగుమ్మా. ప్రధాని నినాదించిన వోకల్ ఫర్ లోకత్లో భాగంగా ఈ స్టార్టప్ మొదలు పెట్టింది.
అలియా మొదలు పెట్టిన ఈ స్టార్టప్ ప్రత్యేకత నేచురల్ ఫ్యాబ్రిక్స్. ప్లాస్టిక్తో తయారుచేసిన బటన్స్ను ఇందులో ఉపయోగించరు. ఎడ్ ఎ మమ్మా ద్వారా ప్రకృతిని కాపాడాలని అలియా ఆలోచన అనేట్టుగా ఉంది. ఎడ్ ఎ మమ్మా స్టోర్ల సంఖ్య పెంచడంతోపాటు పిల్లల పుస్తకాల ద్వారా స్టోరీలు కూడా చెప్పనున్నట్లుగా సమాచారం. ఇందులో భాగంగా ప్రకృతికి సంబంధించిన కథలను పిల్లలు చెప్పబోతుంది. ప్రతి గార్మెంట్ ఒక కథ చెబుతుంది. ప్రకృతి పట్ల ప్రేమను పెంచుతుంది అనేది అలియా మాట.