రూమర్స్పై క్లారిటీ ఇచ్చిన హరీష్ శంకర్
ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా ‘వాల్మీకి’ అనే సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన పవర్స్టార్ పవన్ కళ్యాణ్తో ఓ సినిమా తెరకెక్కించనున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించబోతోందని చెప్పుకొచ్చారు. మరోవైపు ‘వాల్మీకి’ సినిమాలో హీరోయిన్గా నటించడానికి పూజా హెగ్డే భారీ పారితోషికం డిమాండ్ చేసిందని పలు వెబ్సైట్లలో ప్రచారం జరిగింది. ఇక వీటిపై హరీష్ శంకర్ తాజాగా […]
ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా ‘వాల్మీకి’ అనే సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన పవర్స్టార్ పవన్ కళ్యాణ్తో ఓ సినిమా తెరకెక్కించనున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించబోతోందని చెప్పుకొచ్చారు. మరోవైపు ‘వాల్మీకి’ సినిమాలో హీరోయిన్గా నటించడానికి పూజా హెగ్డే భారీ పారితోషికం డిమాండ్ చేసిందని పలు వెబ్సైట్లలో ప్రచారం జరిగింది. ఇక వీటిపై హరీష్ శంకర్ తాజాగా స్పందించారు.
‘వార్తలు వైరల్గా మారాయి కాబట్టి స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత నాపై ఉందని భావిస్తున్నా. ఇందులో మొదటిది.. పూజా హెగ్డే పారితోషికంపై జరుగుతున్న ప్రచారం నిజం కాదు. రెండోది.. మీకంతా తెలుసు. నాకు పవర్స్టార్ను డైరెక్ట్ చేయడం అంటే చాలా ఇష్టమని. కానీ ఆయనతో ఎటువంటి సినిమాను తెరకెక్కించట్లేదని పేర్కొన్నారు. ఏదైనా సరే.. నా నుంచి, లేదా నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఎదురుచూడాలని సినీ ప్రేమికుల్ని కోరుతున్నా. ధన్యవాదాలు’ అని హరీష్ ట్వీట్లు చేశారు.
As the news are going viral I feel responsible to give clarity on these two things
1) The remuneration thing about @hegdepooja is not true
2) As you all know, I love to direct Power Star the news about recent meeting is also not true .
— Harish Shankar .S (@harish2you) May 4, 2019
I request all the film lovers to wait for the official announcement either from me or from Production House … Thank you 🙂
— Harish Shankar .S (@harish2you) May 4, 2019