Waheeda Rehman: బాలీవుడ్ సీనియర్ నటి వహీదా రెహమాన్‌కు ప్రతిష్టాత్మక దాదాసాహేబ్‌ ఫాల్కే అవార్డు

ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటి వహీదా రెహమాన్ దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈమేరకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్విటర్‌లో వెల్లడించారు. ఐదు దశాబ్దాల పాటు భారత సినీ రంగానికి ఆమె అందించిన సేవలకు గానూ ఈ అవార్డును అందిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. హిందీలో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించారు వహీదా. 1955లో రోజులు మారాయి తెలుగు సినిమాతో ఎంట్రీ ఇచ్చారు వహీదా రెహమాన్‌. ఆమె ఎక్కువగా హిందీ సినిమాల్లోనే నటించారు.

Waheeda Rehman: బాలీవుడ్ సీనియర్ నటి వహీదా రెహమాన్‌కు ప్రతిష్టాత్మక దాదాసాహేబ్‌ ఫాల్కే అవార్డు
Waheeda Rehman

Updated on: Sep 26, 2023 | 1:26 PM

వహీదా రెహమాన్‌కు దాదాసాహెబ్ ఫాల్కే జీవితకాల సాఫల్య పురస్కారం దక్కింది. ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటి వహీదా రెహమాన్ దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈమేరకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్విటర్‌లో వెల్లడించారు. ఐదు దశాబ్దాల పాటు భారత సినీ రంగానికి ఆమె అందించిన సేవలకు గానూ ఈ అవార్డును అందిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. హిందీలో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించారు వహీదా. 1955లో రోజులు మారాయి తెలుగు సినిమాతో ఎంట్రీ ఇచ్చారు వహీదా రెహమాన్‌. ఆమె ఎక్కువగా హిందీ సినిమాల్లోనే నటించారు.

వహీదా రెహ్మాన్‌ను 1972లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది, తర్వాత 2011లో ఆమె పద్మభూషణ్‌ను అందుకుంది. వహీదా రెహ్మాన్ ఐదు దశాబ్దాలకు పైగా కెరీర్‌లో 90కి పైగా చిత్రాలలో నటించి మెప్పించారు. ఇప్పుడు వహీదాకు రెహమాన్‌కు ప్రతిష్టాత్మక దాదాసాహేబ్‌ ఫాల్కే అవార్డు లభించింది. 50 ఏళ్ల పాటు ఆమె సినిమా రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆమెకు ఈ అవార్డు లభించింది.

వహీదా ప్రస్తుతం ముంబై లో నివసిస్తున్నారు. వహీదా రెహమాన్ 1974లో శశిరేఖిని ని వివాహం చేసుకున్నారు. శశి రేఖిని కమల్జీత్  అని కూడా పిలుస్తారు. ఆయనకూడా నటుడే.. హిందీలో పలు సినిమాల్లో నటించాడు. 21 నవంబర్ 2000న కమల్జీత్ మరణం తర్వాత వహీదా ముంబైలో తన పిల్లతో కలిసి ఉంటున్నారు.

 వహీదా రెహమాన్ ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.