Tollywood: సినిమాలు వదిలేసి ఆర్మీలోకి.. ఆపై కార్గిల్ యుద్ధంలో సైనికుడిగా.. ఆ హీరో ఎవరంటే..
సినీరంగంలో ఒకప్పుడు స్టార్ హీరో. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. హీరోగానే కాకుండా వయసుకు తగినట్లుగా వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. కానీ కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే సినిమాలు వదిలేసి కార్గిల్ యుద్ధంలో చేరి సేవలు అందించాడు. భారత సైన్యంలో చేరి రియల్ హీరో అనిపించుకున్నాడు.

భారతీయ సినీపరిశ్రమలో వైవిధ్యమైన పాత్రలు, విభిన్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తనదైన నటనతో అడియన్స్ హృదయాల్లో చోటు సంపాదించుకున్న ఆ నటుడు ఏకంగా మూడు సార్లు నేషనల్ అవార్డ్ గెలుచుకున్నారు. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో సినీప్రియులను అలరించాడు. కానీ వరుస సినిమాలతో కెరీర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడే కార్గిల్ యుద్ధ సమయంలో సైన్యంలో చేరి సరిహద్దుల్లో విశేషమైన సేవలు అందించాడు. ఈ ఆసక్తికరమైన విషయాన్ని సదరు నటుడు స్వయంగా వెల్లడించాడు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు సైన్యంలో చేరాలనే తపన ఆయన మాటల్లోనే కనిపించింది. ఇన్నాళ్లు వెండితెరపై నటుడిగా అలరించిన ఆయన కార్గిల్ యుద్ధ సమయంలో సైన్యంలో చేరి సేవలు అందించాడనే విషయం తెలిసి జనాలు షాకవుతున్నారు. ఇంతకీ ఆ నటుడు ఎవరో తెలుసా.. ? అతడే బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్. తాజాగా అమితాబ్ బచ్చన్ నిర్వహిస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి షోలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని బయటపెట్టాడు.
నానా పటేకర్ హిందీ చిత్రపరిశ్రమలో ఎన్నో చిత్రాల్లో నటించి నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నానా పటేకర్ మిలటరీ జీవితానికి కొత్త కాదు. 1990లో తొలినాళ్లలో ప్రహార్ సినిమా చేస్తున్న సమయంలో ఆయన మూడేళ్లు మరాఠ లైట్ ఇన్ఫాంట్రీతో కలిసి ట్రైనింగ్ తీసుకున్నాడు. 1999లో కార్గిల్ యుద్ధంలో పాల్గొనాలనుకున్నాడు. వెంటనే ఆర్మీలోని సీనియర్ అధికారులను కలిసి ఫ్రంట్ లైన్ కు వెళ్లాలనే కోరికను తెలిపాడు. అందుకు రక్షణ మంత్రి అనుమతి ఉండాలని తెలియడంతో అప్పటి రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ కు ఫోన్ చేసి తాను మరాఠా లైట్ ఇన్ఫాంట్రీలో శిక్షణ తీసుకున్న విషయాన్ని చెప్పాడు. దీంతో వెంటనే అతడికి అనుమతి ఇచ్చారు. 1999 ఆగస్టులో నానా పటేకర్ ఏకంగా రెండు వారాలపాటు సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి గడిపాడు.అక్కడ సైనికులకు సాయం చేయడం.. గాయపడిన వారి కోసం బేస్ హాస్పిటల్లో పనిచేయడం లాంటి పనులు చేశాడు. అక్కడి పరిస్థితులు ఎంతో కఠినంగా ఉండేవని.. శ్రీనగర్ కు వెళ్లేప్పుడు తాను 76 కిలోల బరువు ఉండగా.. తిరిగి వచ్చేసరికి 56 కిలోలు ఉన్నట్లు తెలిపాడు.

Nana Patekar
కార్గిల్ యుద్ధం ముగిసిన తర్వాత నానా పటేకర్ మళ్లీ తన సినీ ప్రయాణాన్ని కొనసాగించాడు. గతేడాది వన్వాస్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు. అంతేకాదు.. అంతకుముందు విభిన్నమైన సినిమాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అటు కార్గిల్ యుద్ధంలో సైనికుడిగా దేశం కోసం సేవ చేశాడు. ఈ విషయం తెలిసి నానా పటేకర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు జనాలు.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..




