
బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్బీర్ కపూర్ చిక్కుల్లో పడ్డారు. ఆన్లైన్ గేమింగ్ యాప్కు సంబంధించిన కేసులో అతనికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సమన్లు జారీ చేసింది . వివరాల్లోకి వెళితే..మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి బాలీవుడ్ నటులు, సంగీతకారులకు ఈడీ నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని కోరింది. ఇప్పుడు ఇదే కేసులో బాలీవుడ్ స్టార్ నటుడు రణబీర్ కపూర్ కూడా సమన్లు పంపి సమాధానం చెప్పాల్సిందిగా కోరింది. మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ సహ యజమాని సౌరభ్ చంద్రకర్ కొన్ని నెలల క్రితం దుబాయ్లో వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లికి దాదాపు 200 కోట్లు ఖర్చు చేసినట్లు ED అంచనా వేసింది. ఇందులో 140 కోట్లను ముంబైలోని ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి హవాలా రూపంలో ఇచ్చారు. ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ద్వారా బాలీవుడ్ నటీనటులు, గాయకులకు చెల్లింపులు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పెళ్లి వేడుకలో పాల్గొన్న సినీ నటుల ఇళ్లపై ఈడీ దాడులు చేసింది. ఈ వివాహ వేడుకలో బాలీవుడ్ నటులు టైగర్ ష్రాఫ్, సన్నీలియోన్, కృతి కర్బందా, నుస్రత్ బారుచా, భాగ్యశ్రీ, కృష్ణ అభిషేక్, భారతి, గాయకులు నేహా కక్కడ్, అతిఫ్ అస్లాం, రహత్ ఫతే అలీ ఖాన్, విశాల్ దద్లానీ, అలీ అస్గర్ తదితరులపై ED దాడులు చేసింది. ఇప్పుడు ఈ కేసు కూడా రణ్బీర్ కపూర్కి చేరింది. అయితే ఈ పెళ్లికి రణబీర్ కపూర్ సంబంధం లేదంటున్నారు.
కాగా దుబాయ్లో మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ సహ యజమాని సౌరభ్ చంద్రకర్ వివాహానికి హాజరయ్యేందుకు నాగ్పూర్ నుండి చాలా ప్రైవేట్ జెట్లు బుక్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే దుబాయ్లోని హోటళ్లకు 40 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని సమాచారం. ఇవే కాకుండా 40 కోట్ల డబ్బు, పెళ్లికి వెచ్చించిన వందల కోట్ల డబ్బు హవాలా ద్వారా ఇచ్చారని ఈడీ ప్రాథమిక విచారణలో తేలింది. కాగా సౌరభ్ చంద్రకర్ మరియు రవి ఉప్పల్ దుబాయ్ నుండి మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ను నడుపుతున్నారు. కొత్త వినియోగదారులను చేరుకోవడానికి, డబ్బును మరియు ఇతర విధులను బదిలీ చేయడానికి లేయర్డ్ వెబ్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇండియాలో చాలా మంది ఏజెంట్లను నియమించాడని, 70:30 నిష్పత్తిలో లాభాన్ని పంచుకున్నారని ఈడీ తెలిపింది. ఈ కేసుకు సంబంధించి రూ.417 కోట్ల విలువైన నగదు, బంగారం, ఆస్తులను ఈడీ జప్తు చేసింది. భోపాల్, ముంబై, కోల్కతా సహా మరికొన్ని నగరాల్లో ఈడీ దాడులు నిర్వహించింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.