AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆస్కార్ జ్యూరీలో ‘బాహుబలి’ టెక్నీషియన్!

దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడి ఖ్యాతిని రెట్టింపు చేసిందని చెప్పాలి. ఎన్నో రికార్డులకు ఈ సినిమా కేరాఫ్ అడ్రెస్. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఈ సినిమాకు గొప్ప ప్రశంసలు అందాయి. ఇక ఈ విభాగంలో బెజవాడకు చెందిన శ్రీనివాస్ మోహన్ పని చేశారు. తాజా సమాచారం ప్రకారం ఆయన అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అకాడమీ అవార్డుల (ఆస్కార్) జ్యూరీ మెంబర్‌గా విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో ఇండియా తరపున ఎంపికయ్యారు.  ప్రపంచ వ్యాప్తంగా వివిధ […]

ఆస్కార్ జ్యూరీలో 'బాహుబలి' టెక్నీషియన్!
Ravi Kiran
|

Updated on: Jul 04, 2019 | 1:26 AM

Share

దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడి ఖ్యాతిని రెట్టింపు చేసిందని చెప్పాలి. ఎన్నో రికార్డులకు ఈ సినిమా కేరాఫ్ అడ్రెస్. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఈ సినిమాకు గొప్ప ప్రశంసలు అందాయి. ఇక ఈ విభాగంలో బెజవాడకు చెందిన శ్రీనివాస్ మోహన్ పని చేశారు.

తాజా సమాచారం ప్రకారం ఆయన అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అకాడమీ అవార్డుల (ఆస్కార్) జ్యూరీ మెంబర్‌గా విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో ఇండియా తరపున ఎంపికయ్యారు.  ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన 842 కొత్త సభ్యులను ఆస్కార్ కమిటీ ప్రకటించగా.. ఇందులో భారత్ నుంచి అనుపమ్ ఖేర్‌తో పాటు శ్రీనివాస్ మోహన్ ఎంపికయ్యారు. ‘బాహుబలి’, ‘రోబో 2.0’, ‘క్రిష్’,  ‘ఐ’ లాంటి చిత్రాలకు పని చేసిన శ్రీనివాస్ ఆస్కార్ జ్యురీ మెంబర్‌గా ఎన్నికవడం సంతోషంగా ఉందని అయన అభిమానులు అంటున్నారు. అటు ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కూడా సోషల్ మీడియా వేదికగా శ్రీనివాస్ మోహన్‌కు శుభాకాంక్షలు తెలిపింది.