AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో.. వీళ్లు మామూలు ఆడోళ్లు కాదురోయ్‌..

వామ్మో.. వీళ్లు మామూలు ఆడోళ్లు కాదురోయ్‌..

Samatha J
|

Updated on: Feb 14, 2026 | 4:10 PM

Share

నంద్యాల పట్టణంలోని ప్రధాన వ్యాపార కూడలిలో దొంగలు రెచ్చిపోయారు. సాధారణ కస్టమర్స్‌లా నటిస్తూ వచ్చి, కన్నుగప్పి వెండి ఆభరణాలను దోచుకెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నంద్యాల మెయిన్ బజార్‌లోని హెచ్.ఎం. జ్యువెలరీ షాపునకు ఇద్దరు మహిళలు వెండి పట్టీలు కొనుగోలు చేయడానికి వచ్చారు. షాపు యజమాని అల్తాఫ్‌ను మాటల్లో దించిన ఆ కిలేడీలు, మంచి మోడల్‌ పట్టీలు చూపించమని అడిగారు.

అతను తమవద్ద ఉన్న వెండి పట్టీలు వారి ముందు ఉంచి చూపించారు. వాటిలో ఒక జత సెలెక్ట్‌ చేసినట్టు చేసి వాటి తూచి..ధర చెప్పమన్నారు. అతను పట్టీలకు ధర కట్టే పనిలో ఉండగా వారిలో ఓ మహిళ రెండు జతల పట్టీలను చాకచక్యంగా నొక్కేసింది. ఆ తర్వాత పట్టీలు మోడల్‌ నచ్చలేదని, ఏమీ తెలియనట్లుగా అక్కడి నుంచి జారుకున్నారు. మహిళల ప్రవర్తనపై అనుమానం వచ్చిన అల్తాఫ్, వారు వెళ్ళిన వెంటనే షాపులోని సిసి కెమెరా ఫుటేజీని పరిశీలించారు. అందులో ఆ మహిళలు పట్టీలను దొంగిలిస్తున్న దృశ్యాలు స్పష్టంగా రికార్డు అయ్యాయి. దీంతో లబోదిబోమన్న బాధితుడు వెంటనే నంద్యాల వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సిసి పుటేజీని స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న క‌వ‌లల పేర్లకు ఉన్న అర్థాలు ఇవే..!

బంగారాన్ని మించిపోయిందే.. ఈ కలప కొనాలంటే కోట్లు పెట్టాల్సిందే!

బురదలో తేలుతున్న వెండి.. జనం వేట చూస్తే షాక్ అవ్వాల్సిందే!

సొంతకారులో ఉత్సాహంగా ఇంటికి వెళ్తున్న యువకుడు..అంతలోనే..

హాస్టల్‌లో ఉండటానికి భయపడుతున్న విద్యార్థులు.. ఎందుకంటే?