Samantha: లెక్క సెట్‌ చేయడానికి సిద్ధమైన సమంత.. ఏడాదిలో ఏకంగా మూడు చిత్రాలతో..

|

Sep 10, 2022 | 6:35 AM

Samantha: నిత్యం వార్తల్లో నిలిచే నటీమణుల్లో సమంత ఒకరు. 2009లో వచ్చిన ఏ మాయ చేశావే చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అనతికాలంలోనే నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. వరుస సినిమాల్లో...

Samantha: లెక్క సెట్‌ చేయడానికి సిద్ధమైన సమంత.. ఏడాదిలో ఏకంగా మూడు చిత్రాలతో..
Samantha
Follow us on

Samantha: నిత్యం వార్తల్లో నిలిచే నటీమణుల్లో సమంత ఒకరు. 2009లో వచ్చిన ఏ మాయ చేశావే చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అనతికాలంలోనే నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. వరుస సినిమాల్లో నటిస్తూ, దాదాపు టాలీవుడ్‌లో అందరు అగ్ర హీరోల సరసన నటించిందీ బ్యూటీ. ఇక సమంత కెరీర్‌ గ్రాఫ్‌ను ఎప్పుడు చూసుకున్న ఏడాదిలో కనీసంలో కనీసం రెండు నుంచి మూడు సినిమాల్లో నటిస్తూ వచ్చింది. అయితే వివాహం తర్వాత సినిమాల్లో వేగాన్ని తగ్గించింది. మజిలి, ఓబేబీ తర్వాత చాలా రోజులు గ్యాప్‌ ఇచ్చిన సమంత జానులో మాత్రమే కనిపించింది.

ఇక 2020లో వచ్చిన జాను చిత్రంలోనే సమంత చివరిసారిగా వెండి తెరపై కనించింది. అయితే పుష్ప చిత్రంలో మాత్రం స్పెషల్‌ సాంగ్‌లో కనిపించి మరోసారి ఇండస్ట్రీని షేక్‌ చేసింది. కేవలం 5 నిమిషాల పాటతోనే అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. దాదాపు రెండేళ్లు గడుస్తున్న సమంత నుంచి సినిమా రాకపోవడంతో ఇప్పుడు ఆ గ్యాప్‌ను ఫిల్‌ చేయడానికి సమంత చక్కటి ప్లాన్‌ను చేసుకుంది. వైవాహిక జీవితానికి ఫుల్‌ స్టాప్‌ పెట్టిన తర్వాత కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన సామ్‌.. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీగా మారింది. ప్రస్తుతం ఒకే సమయంలో ఖుషీ, శాకుంతలం, యశోద చిత్రాల్లో నటిస్తోంది.

వీటితో పాటు బాలీవుడ్‌లో ఓ వెబ్‌ సిరీస్‌తో పాటు హాలీవుడ్‌ చిత్రంలోనూ నటిస్తోంది. యశోద చిత్రం షూటింగ్ ఇప్పటికే తుది దశకు చేరుకోగా, శాకుంతలం ఇప్పటికే పూర్తయింది. ఖుషీ కూడా షరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.  దీంతో కేవలం ఏడాదిలోనే సమంత నటించిన మూడు చిత్రాలు విడుదల కానున్నాయి. వీటిలో రెండు చిత్రాలు హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రాలో కావడం విశేషం. మరి చాలా గ్యాప్‌ తర్వాత వెండి తెరపై సందడి చేయనున్న సమంత కెరీర్‌ను ఈ సినిమాలు ఎలాంటి మలుపులు తిప్పుతాయో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..