AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchu Lakshmi: అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న మంచు లక్ష్మి.. ప్రపంచంలోనే 100 మందిలో ఒకరిగా..

Manchu Lakshmi: తండ్రి నట వారసత్వం అందుకున్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు మంచు లక్ష్మి. కేవలం నటిగానే కాకుండా సింగర్‌గా, నిర్మాతగానూ మంచి పేరు తెచ్చుకున్నారు. అమెరికాలో ఉన్న సమయంలో...

Manchu Lakshmi: అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న మంచు లక్ష్మి.. ప్రపంచంలోనే 100 మందిలో ఒకరిగా..
Manchu Laxmi
Narender Vaitla
|

Updated on: Aug 19, 2022 | 1:05 PM

Share

Manchu Lakshmi: తండ్రి నట వారసత్వం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు మంచు లక్ష్మి. కేవలం నటిగానే కాకుండా సింగర్‌గా, నిర్మాతగానూ మంచి పేరు తెచ్చుకున్నారు. అమెరికాలో ఉన్న సమయంలో కొన్ని హాలీవుడ్‌ సిరీస్‌లో నటించ మంచు లక్ష్మి తర్వాత ఇండియాకు తిరిగొచ్చారు. అనంతరం ‘అనగనగా ధీరుడు’ సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఆమె అద్భుత నటనగాను కూడా నంది అవార్డును సైతం అందుకున్నారు.

అంతేకాకుండా సింగర్‌గా మారి బెస్ట్‌ సెలబ్రిటీ సింగర్‌గా గామా అవార్డును సైతం అందుకుంది. ఇక సినిమాలతో బిజీగా ఉండే లక్ష్మీ.. సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. యూట్యూబ్‌లో సొంతంగా చానల్స్‌ నిర్వహిస్తూనే మరో వైపు సోషల్‌ మీడియాలో ఫిట్‌నెస్‌, సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది.

ఇవి కూడా చదవండి

ఇలా నిత్యం ఏదో అంశంతో వార్తలో నిలిచే మంచు లక్ష్మి తాజాగా మరోసారి వార్తల్లోకెక్కారు. అతికొద్ది మందికి మాత్రమే లభించే అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. టీసీ కండ్లెర్‌ అనే మ్యాగజైన్‌ ప్రతీ ఏటా 100 మోస్ట్‌ బ్యూటిఫుల్‌ ఫేసెస్‌ గ్లోబల్‌ జాబితాను విడుదల చేస్తుంది. తాజాగా లక్ష్మి మంచు ఇందుకు నామినేట్‌ అయ్యారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలిపారు. తనను నామినేట్‌ చేసిందుకు ధన్యవాదాలు తెలుపుతూ పోస్ట్‌ చేశారు. ఇక టీసీ కండ్లెర్‌ విషయానికొస్తే.. ఈ సంస్థ 1990 నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉండే సినిమా, టీవీ, పాప్‌ ఆర్టిస్ట్‌లకు ఈ జాబితాలో చోటు కల్పిస్తుంటారు. ఈ ఏడాదికి గాను తెలుగు నుంచి నటి మంచు లక్ష్మి చోటు దక్కించుకోవడం విశేషం.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..