AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘కుమారి’ కొత్త అవతారం.. చూస్తే షాక్ అవ్వాల్సిందే

'అలా ఎలా'తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి 'కుమారి 21f'తో పెద్ద విజయాన్ని ఖాతాలో వేసుకుంది హెబా పటేల్‌. అంతేకాదు కెరీర్ ప్రారంభంలోనే

'కుమారి' కొత్త అవతారం.. చూస్తే షాక్ అవ్వాల్సిందే
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 19, 2020 | 6:11 PM

Share

Hebah Patel look: ‘అలా ఎలా’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ‘కుమారి 21f’తో పెద్ద విజయాన్ని ఖాతాలో వేసుకుంది హెబా పటేల్‌. అంతేకాదు కెరీర్ ప్రారంభంలోనే ఈ భామ వరుసగా ఐదు సక్సెస్‌లను ఖాతాలో వేసుకుంది. దీంతో ఈ బ్యూటీ టాప్ హీరోయిన్‌గా ఎదుగుతుందని అందరూ భావించారు. అయితే ఆ తరువాత బోల్డ్‌ కారెక్టర్‌లకే పరిమితం కావడం, వరుసగా ప్లాప్‌లు రావడంతో కాస్త వెనుకబడి పోయింది.

కానీ ఈ ఏడాది భీష్మ సినిమాతో మళ్లీ ప్రేక్షకులను పలకరించింది. ఇందులో రెండో హీరోయిన్‌గా నటించినప్పటికీ, గుర్తుండిపోయే పాత్రలోనే కనిపించింది. మరోవైపు రాజ్‌తరుణ్, ఒరేయ్ బుజ్జిగాలోనూ రెండో హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం అక్టోబర్‌లో ఓటీటీలో విడుదల కానుంది. ఇక రామ్ ‘రెడ్‌’ మూవీలోనూ ఐటం సాంగ్‌లో హెబా మెరిసింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ నటి ఓడెల రైల్వే స్టేషన్ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుండగా.. ఇందులో ఆమె లుక్‌ లీక్ అయ్యింది.

గ్రామీణ మహిళ పాత్రలో మేకప్ లేకుండా హెబా నటిస్తోంది. ఈ ఫొటోలో హెబా సహజంగా కనిపిస్తుండగా.. ఆ పాత్రలో ఆమె ఒదిగిపోయి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ చిత్రానికి అశోక్ తేజ అనే కొత్త వ్యక్తి దర్శకత్వం వహిస్తుండగా.. సంపత్ నంది స్క్రిప్ట్‌, స్క్రీన్‌ప్లే అందించారు. కేజీఎఫ్‌ ఫేమ్‌ వశిష్ట సింహ హీరోగా నటిస్తున్నారు. కేకే రాధామోహన్ నిర్మిస్తోన్న ఈ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

Read More:

Bigg Boss 4: రెమ్యునరేషన్‌పై సూర్య కిరణ్ షాకింగ్ కామెంట్లు

అప్పుడు తప్ప ఎప్పుడూ స్మోక్ చేయను: రకుల్

Follow Us