Bengal Assembly Election 2021 Phase-2 Voting LIVE: బెంగాల్‌లో రెండో విడత పోలింగ్.. ఆసక్తి రేకెత్తిస్తున్న నందిగ్రామ్‌ రచ్చ..

| Edited By: Ravi Kiran

Updated on: Apr 01, 2021 | 7:49 PM

బెంగాల్‌లో రెండో దశలో భాగంగా 30 స్థానాల్లో మొత్తం 171 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. మొత్తం 30 స్థానాల పరిధిలో 75.94లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అయితే..

Bengal Assembly Election 2021 Phase-2 Voting LIVE: బెంగాల్‌లో రెండో విడత పోలింగ్.. ఆసక్తి రేకెత్తిస్తున్న నందిగ్రామ్‌ రచ్చ..
Bengal

Bengal Assembly Election 2021:  పశ్చిమ బెంగాల్‌లో (Bengal Assembly Election 2021 )ఈ రోజు రెండవ దశ ఓటింగ్ 30 సీట్లలో ఓటింగ్ ప్రారంభమైంది. మొదటి దశలో కూడా 30 సీట్లకు మాత్రమే ఓటింగ్ జరిగింది (Phase 2 Voting On 30 Seats) . ఇవాళ కూడా మరో 30 సీట్లకు ఓటింగ్ జరుగుతోంది. ఇక్కడ 30 సీట్లలో 8 సీట్లు రిజర్వు ఉన్నాయి. బెంగాల్‌లో మొత్తం 10 వేల 620 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. రెండో దశలో మొత్తం 171 మంది బరిలో ఉండగా… అందులో 19 మంది మహిళా అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇవాళ సుమారు 75,94, 549 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు.

ఇవాళ బెంగాల్‌లో ఓటింగ్ జరుగుతున్న 30 సీట్లలో బంకురాలో 8, దక్షిణ 24 పరగణాల్లో 4, ఉత్తర మెడినిపూర్‌లో 9, తూర్పు మదీనిపూర్‌లో 9 సీట్లు ఉన్నాయి. నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 800 కంపెనీల భద్రతా సిబ్బందిని మోహరించారు. నందిగ్రామ్‌లో మాత్రమే 22 కంపెనీలను భద్రత కోసం మోహరించారు. ప్రతి సున్నితమైన బూత్ వద్ద 2 మంది భద్రతా సిబ్బందిని నియమించారు. అదే సమయంలో ప్రతి బూత్‌లో సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేశారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 01 Apr 2021 04:45 PM (IST)

    మధ్యాహ్నం 3.30 గంటల వరకు..

    మధ్యాహ్నం 3.30 గంటల వరకు బంగాల్​లో 71 శాతం పోలింగ్​ నమోదైందని ఎన్నికల సంఘం ప్రకటించింది. అసోంలో 63 శాతానికిపైగా ఓటు హక్కు వినియోగించుకున్నారని వెల్లడించింది.

  • 01 Apr 2021 03:33 PM (IST)

    బంగాల్​ డెబ్రాలో బీజేపీ నాయకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

    బంగాల్​ డెబ్రాలో బీజేపీ నాయకుడిని  మోహన్​ సింగ్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండో దశ పోలింగ్​ జరుగుతుండగా.. నియోజకవర్గంలోని ఓ పోలింగ్​ బూత్​కు సమీపంగా (100మీటర్ల) ఆయన వెళ్లడనే కారణంగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే ఆ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి భారతి ఘోష్​ పిలవడం వల్లే తాను అక్కడికి వెళ్లినట్టు మోహన్​ వెల్లడించారు. మోహన్​ను పోలీసులు తీసుకెళుతున్న సమయంలో బీజేపీ కార్యకర్తలు  ఆందోళనకు దిగారు.

  • 01 Apr 2021 03:21 PM (IST)

    ఈసీ చర్యలు తీసుకోకపోతే కోర్టుకు వెళ్తా - సీఎం మమతా

    రెండో విడత ఎన్నికలకు సంబంధించి ఈసీకి ఇప్పటివరకు 63 ఫిర్యాదులు చేసినట్లు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన గూండాలు బంగాల్​లో విధ్వంసం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఈసీ చర్యలు తీసుకోకపోతే కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు.

  • 01 Apr 2021 02:00 PM (IST)

    బీజేపీ కార్యకర్త ఆత్మహత్య కలకలం..

    పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో రెండో దశ పోలింగ్ జరుగుతుంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్ నియోజకవర్గంలో ఓ బీజేపీ కార్యకర్త ఆత్మహత్య కలకలం రేపింది. తన ఇంట్లో ఓ బీజేపీ కార్యకర్త గురువారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నందిగ్రామ్ లోని బేకుటియా ప్రాంతానికి చెందిన బీజేపీ కార్యకర్త ఉదయ్ దూబే గురువారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఇతని ఆత్మహత్యకు టీఎంసీనే కారణమని బీజేపీ నేతలు ఆరోపించారు.ఉదయ్ దూబే సూపర్ స్టార్ మిథున్ చక్రవర్తి రోడ్ షో కు హాజరైన తర్వాత టీఎంసీ నుంచి బెదిరింపులు రావడంతో తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని బీజేపీ నేతలు చెబుతున్నారు.

  • 01 Apr 2021 01:59 PM (IST)

    నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గంలో CM పర్యటన

    నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ జరుగుతున్న తీరును ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పర్యటించారు.  చక్రాల కుర్చీ  చేయడానికి బెంగాల్ సిఎం  తన నివాసం నుండి బయలుదేరారు.

  • 01 Apr 2021 01:43 PM (IST)

    బెంగాల్‌లో మధ్యాహ్నం 1 గంట వరకు 58.15 శాతం పోలింగ్

    బెంగాల్‌లో మధ్యాహ్నం 1 గంట వరకు 58.15 శాతం పోలింగ్ జరిగింది. బంకుర 59.41 శాతం, పశ్చిమ మదీనిపూర్ 59.32 శాతం, తూర్పు మదీనిపూర్ 60.32 శాతం, దక్షిణ 24 పరగణాల పోలింగ్ 48.13 శాతం నమోదైంది.

  • 01 Apr 2021 12:55 PM (IST)

    కదలని బెంగాల్ ఓటర్లు.. మధ్యాహ్నం 12 గంటలకు కేవలం...

    బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ మందకోడిగా సాగుతోంది. ఈ దశలోని 30 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు జరిగిన ఓటిగ్ సరళిని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.  మధ్యాహ్నం కేవలం 27 శాతం మాత్రమే ఓటింగ్ జరిగింది.

  • 01 Apr 2021 11:12 AM (IST)

    ఓటు వేయకుండా అడ్డుకుంటున్నారంటూ నిరసన...

    ఓట్లు వేసేటప్పుడు టిఎంసి కార్మికులు తమను ఆపుతున్నారని ఆరోపిస్తూ సిపిఐ(ఎం) కార్యకర్తలు ఈ రోజు ఘటాల్‌లో నిరసన వ్యక్తం చేశారు. తరువాత భద్రతా దళాలు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు.

  • 01 Apr 2021 09:55 AM (IST)

    ఉదయం 9 గంటల వరకు 0.56 శాతం..

    బెంగాల్‌లో ఉదయం 9 గంటల వరకు 0.56 శాతం పోలింగ్ నమోదైంది. ఓటర్లు ఓటింగ్ కోసం  ఇప్పిడిప్పుడే ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు.

  • 01 Apr 2021 09:53 AM (IST)

    ఇదే పద్దతి.. కనీసం కుర్చీలు కూడా....

    పింగ్లా నియోజకవర్గంలోని పోలింగ్ కౌంటర్ల వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేయక పోవడంపై బీజేపీ నేత అమిత్ మాల్వియా ఆంధోళన వ్యక్తం చేశారు. పోస్టర్లు ఉన్న ఓ ఫోటోను ట్వీట్ చేశారు.

  • 01 Apr 2021 08:50 AM (IST)

    పెద్ద ఎత్తున ఓట్లు వేయాలని...

    రెండవ దశ జరుగుతున్న ఓటింగ్‌లో పెద్ద ఎత్తున ఓట్లు వేయాలని  కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగాల్ ప్రజలను విజ్ఞప్తి చేశారు. మీ ఒక ఓటు రాష్ట్రంలో నిర్ణయాత్మక మార్పును తెస్తుందని ఆయన అన్నారు. కాబట్టి, సురక్షితమైన.. సంపన్నమైన బెంగాల్‌కు ఓటు వేయండి.

  • 01 Apr 2021 08:42 AM (IST)

    ఓటు హక్కు వినియోగించుకున్న సువేందు అధికారి

    బీజేపీ తరపున పోటీ చేస్తున్న సువేందు అధికారి ఈరోజు ఉదయాన్నే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. నందీగ్రామ్‌లోని పోలింగ్ బూత్ నంబరు 76 లో ఆయన ఓటు వేశారు. మోటార్ సైకిల్‌పై పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆయన.. ఉదయం 8 గంటలకు ఓటు వేశారు. ఒకవైపు ఓటింగ్ జరుగుతుండగా, మరోవైపు టీఎంసీ నేతలు ప్రత్యర్థులపై పలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. టీఎంసీ మద్దతుదారులను ఓటువేయకుండా అడ్డుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు.  పెద్ద సంఖ్యలో ఓట్లు వేయాలని బెంగాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు సువేందు అధికారి. ఆయన మాట్లాడుతూ దేశం మొత్తం నందిగ్రామ్ వైపు చూస్తోందని అన్నారు. ఇక్కడ అభివృద్ధి గెలుస్తుందా లేదా సంతృప్తిపరిచే రాజకీయమా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు.

     

  • 01 Apr 2021 08:15 AM (IST)

    మొదలైన పోలింగ్..

    BENGAL POLLING: పశ్చిమబెంగాల్‌ రెండో విడత పోలింగ్ మొదలైంది. గురువారం సాయంత్రం 6:30 వరకు కొనసాగనుంది. పశ్చిమబెంగాల్‌లో రెండో విడతలో 30 స్థానాల్లో పోలింగ్ జరుగనుంది.

Published On - Apr 01,2021 4:45 PM

Follow us
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..