AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో పాపం..పెళ్లి పీటలెక్కాల్సిన యువకుడు..

విశాఖపట్నం జిల్లాలో విషాద సంఘటన వెలుగు చూసింది. త్వరలో పెళ్లిపీటలెక్కాల్సిన యువకుడు పాడెక్కాడు. ఏం జరిగిందో తెలియదు గానీ, బలవంతంగా తనువు చాలించాడు. గత పదిరోజుల క్రితమే అతడికి నిశ్చతార్థం జరిగింది. పెళ్లికి మంచి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు కుటుంబీకులు. కానీ అంతలోనే

అయ్యో పాపం..పెళ్లి పీటలెక్కాల్సిన యువకుడు..
Jyothi Gadda
|

Updated on: Feb 25, 2020 | 6:39 PM

Share

విశాఖపట్నం జిల్లాలో విషాద సంఘటన వెలుగు చూసింది. త్వరలో పెళ్లిపీటలెక్కాల్సిన యువకుడు పాడెక్కాడు. ఏం జరిగిందో తెలియదు గానీ, బలవంతంగా తనువు చాలించాడు. గత పదిరోజుల క్రితమే అతడికి నిశ్చతార్థం జరిగింది. పెళ్లికి మంచి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. కానీ అంతలోనే యువకుడి మరణం పెళ్లింట్లో విషాదాన్ని మిగిల్చింది. అటు అమ్మాయి, ఇటు అబ్బాయి ఇరువురి కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళితే…

తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన ఓ యువకుడు విశాఖపట్నంలోని పాయకరావుపేటలో నివసిస్తున్నాడు. గత ఆరేళ్లుగా అక్కడ అద్దె ఇంట్లో ఉంటూ.. నక్కపల్లి మండలంలోని రాజియ్యపేటలో గల హెటిరో కంపెనీలో డాక్యుమెంటరీ డిపార్టుమెంట్‌లో పని చేస్తున్నాడు. ఇటీవలే యువకుడికి పెళ్లి కుదిరింది. నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే ఏమైందో ఏమో తెలియదుగాని ఫిబ్రవరి 23న తన గదిలోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్నమృతుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పెళ్లికుమారిడి చూస్తామనుకున్న తమ కుమారుడి మృతదేహం చూసి భోరున విలపించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.