ఇంటర్ ఫెయిల్.. బాబా అవతారమెత్తి.. మహిళపై అత్యాచారం.. ఆ తర్వాత..
బాబాల అవతారమెత్తి.. ప్రజల్ని మోసం చేసే బ్యాచుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రజల మూఢనమ్మకాలను తమ ఇన్వెస్ట్మెంట్గా భావించి.. ఊరికో బాబాలు పుట్టుకొస్తున్నారు. ఇలా బాబాల అవతారమెత్తిన వారు..
బాబాల అవతారమెత్తి.. ప్రజల్ని మోసం చేసే బ్యాచుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రజల మూఢనమ్మకాలను తమ ఇన్వెస్ట్మెంట్గా భావించి.. ఊరికో బాబాలు పుట్టుకొస్తున్నారు. ఇలా బాబాల అవతారమెత్తిన వారు.. కొందరు సమాజ సేవలు చేస్తే.. మరికొంత మంది బాబాల పేరుకే అపకీర్తి తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. బాబాల పేరుతో అక్రమ దందాలు, మహిళలపై అత్యాచారాలు, దోపిడీలు ఇలా అనేక నేరాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే పలువురు పేరుమోసిన బాబాలు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడి కటకటాలపాలైన సంగతి తెలిసిందే. అందులో డేరా బాబా గురించి తెలిసిందే. ఆశ్రమం మాటున మహిళలపై అత్యాచారాలు, హత్యలు చేసిన సంగతి తెలిసిందే.
తెలంగాణ రాష్ట్రంలో కూడా ఓ వ్యక్తి డేరాబాబాలా అవతారమెత్తాడు. దుబ్బాక మండలం చీకోడ్లో ఓ వ్యక్తి సమర్ధ మహారాజ్ పేరుతో స్వామీజీ అవతారమెత్తాడు. ధర్మాజీ పేటకు చెందిన రఘు అనే వ్యక్తి ఇంటర్ ఫెయిల్ అయ్యాడు. దీంతో ఇక చదువుకుంటే లాభం లేదని.. బాబా అవతారం ఎత్తాడు. అయితే బాబా అని నమ్మిన ఓ మహిళ ఇతడి వద్దకు వచ్చింది. సదరు మహిళ ఓ అమ్మవారి గుడికట్టాలని సంకల్పించింది. అయితే దీనిని ఆసరగా చేసుకున్న స్వామీజీ అలియాస్ రఘు ఆమెపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఆయన శిష్యుడు నరేష్తో కలిసి సదరు మహిళపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాబాగా చెలామణి అవుతున్న రఘపై, ఆయన శిష్యుడు నరేష్లపై పోలీసులు సెక్షన్ 420,376,508,109 కింద కేసులు నమోదు చేశారు. అయితే సదరు మహిళ ఫిర్యాదు చేసే దానికంటే ముందే.. ఆశ్రమ నిర్వాహకులు మహిళపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నరేష్ను అదుపులోకి తీసుకోగా.. రఘ పరారీలో ఉన్నాడు.