Hyderabad: అధిక వడ్డీ ఆశ.. కి’లేడీ’ ట్రాప్‌లో సినిమా స్టార్స్

అధిక వడ్డీ ఇస్తామని చెబితే మోసపోయారు. తమ దగ్గర ఉన్నదంతా సమర్పించుకున్నారు. కట్ చేస్తే.. వడ్డీ కాదు కదా.. అసలుకే దిక్కులేకుండా పోయింది.

Hyderabad: అధిక వడ్డీ ఆశ.. కి'లేడీ' ట్రాప్‌లో సినిమా స్టార్స్
Shipa Chowdary
Follow us

|

Updated on: Nov 27, 2021 | 12:16 PM

అధిక వడ్డీల పేరుతో హై ప్రొఫైల్‌ జనాలకు మస్కా కొట్టింది ఓ కిలాడీ లేడీ. ఒక్కరు కాదు. ఇద్దరు కాదు. పదుల సంఖ్యలోనే జనాలకు కుచ్చుటోపి పెట్టినట్లు తెలుస్తోంది. శిల్పాచౌదరి, శ్రీనివాస్‌ కోటి రూపాయలు తీసుకుని మోసం చేశారని నార్సింగి పీఎస్ లో బాధితులు ఫిర్యాదు చేశారు. కిట్టి పార్టీల పేరుతో డబ్బులు వసూలు చేసి మోసం చేశారని వాపోయారు. ప్రముఖ ఇంటర్నేషన్‌ల్‌ స్కూల్‌ దంపతులను శిల్పా దంపతులు నట్టేట ముంచినట్లు సమాచారం. పేజ్ త్రీ పార్టీల పేరుతో డబ్బులు వసూళ్లు చేయడం వీళ్ల మెయిన్‌ దందా.

ప్రముఖ ఇంటర్నెన్షనల్ స్కూల్ దంపతులను నట్టేట ముంచిన శిల్పా దంపతులు బాధితుల ఫిర్యాదుతో శిల్పా చౌదరి , శ్రీనివాస్‌పై 420 చీటింగ్‌ కేసుతో పాటు ఇతర సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. హై ప్రొఫైల్‌ ముసుగులో మోసాలకు శిల్పా దంపతులు మోసాలకు తెరతీశారు. వీరి బాధితుల్లో సినిమా తారలు కూడా ఉన్నారు.

రియల్‌ ఎస్టేట్‌ దందా పేరుతో శిల్పా చౌదరి దందా స్టార్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. బడాబాబుల బిడ్డలు, కోడళ్లు టార్గెట్‌గా కిట్టీ పార్టీలు నిర్వహించేదట. పార్టీలో తన బిజినెస్‌ ప్రపొజల్స్‌ పెట్టి ఆకర్షించేంది. పదేళ్ల నుండి కిట్టి పార్టీ నిర్వహించి పలువురి దగ్గర కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. గచ్చిబౌలికి చెందిన దివ్యా రెడ్డి దగ్గర కోటి 5 లక్షలు తీసుకుని ఇవ్వకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెతో పాటు పలువురి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

Also Read: Ramagundam: సంచలనం.. రోడ్డు పక్కన వ్యక్తి తల, రెండు వేర్వేరు చేతులు..

మళ్లీ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోన్న రాయలచెరువు.. వరుస లీకేజీలు