Shocking News: కాపురంలో కలహాలు.. భర్త గొంతు కొరికిన భార్య.. చివరికి ఏమైందంటే..
Shocking News: సమాజంలో రోజురోజుకీ విలువలు పడిపోతున్నాయి. క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు కొందరి జీవితాలను మార్చేస్తుంటే, మరికొందరి జీవితాలను ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయి. వందేళ్ల జీవితానికి తమకు మాతము ముగింపు పలుకుతున్న వారు కొందరైతే....
Shocking News: సమాజంలో రోజురోజుకీ విలువలు పడిపోతున్నాయి. క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు కొందరి జీవితాలను మార్చేస్తుంటే, మరికొందరి జీవితాలను ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయి. వందేళ్ల జీవితానికి తమకు మాతము ముగింపు పలుకుతున్న వారు కొందరైతే, ఇతరుల ప్రాణాలను తీస్తున్న వారు మరికొందరు. అనుబంధాలను సైతం మర్చిపోయి, నా అనకునే వాళ్లను సైతం కడతేరుస్తున్నారు. మానవత్వానికే మచ్చ తెచ్చే ఇలాంటి ఓ సంఘటన తాజాగా బీహార్లో జరిగింది. కట్టుకున్న సొంత భర్తనే కడతేర్చింది ఓ భార్య.
వివరాల్లోకి వెళితే.. బిహారల్లోని రోహతాస్ జిల్లాకు చెందిన మహర్షి సింగ్ అనే వ్యక్తికి 2020లో వివాహం జరిగింది. వారికి ప్రస్తుతం 10 నెలల కుమార్తె ఉంది. అయితే మొదట్లో బాగానే ఉన్న వీరి దాంపత్య జీవితంలో గత కొన్ని రోజులుగా గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆదివారం భార్య, భర్తల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. మాటమాట పెరగడంతో సహనం కోల్పోయిన భార్య వెంటనే భర్త గొంతును గట్టిగా కొరికేసింది.
దీంతో తీవ్ర రక్తస్రావం అవ్వడంతో ఆసుపత్రికి చేరుకునే లోపే మహర్షి సింగ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం ఆ మహిళ పరారీలో ఉందని, త్వరలోనే పట్టుకుంటామని పోలీసు అధికారి మనోజ్ కుమార్ తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
Viral Video: ఇదేం డ్రైవింగ్రా బాబు.. కొంచెముంటే ప్రాణాలు పోయేవి..!