AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో విషాదం.. చికిత్స పొందుతూ.. ఉన్నావ్‌ బాధితురాలు మృతి

చావుబతుకుల మధ్య పోరాడుతూ.. ఉన్నావ్ అత్యాచార ఘటన బాధితురాలు తన తుదిశ్వాస విడిచింది. ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. శుక్రవారం రాత్రి 11.40 గంటలకు ప్రాణాలువిడిచినట్లు డాక్టర్లు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. యూపీలోని ఉన్నావ్‌కు చెందిన ఓ యువతి.. తనపై అత్యాచారం జరిపారని.. మార్చిలో ఇద్దరు వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు విచారణలో భాగంగా.. గురువారం రాయ్‌బరేలీలోని కోర్టుకు వెళ్లేందుకు సదరు బాధితురాలు బయల్దేరింది. అయితే కోర్టుకు […]

మరో విషాదం.. చికిత్స పొందుతూ.. ఉన్నావ్‌ బాధితురాలు మృతి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 07, 2019 | 10:41 AM

Share

చావుబతుకుల మధ్య పోరాడుతూ.. ఉన్నావ్ అత్యాచార ఘటన బాధితురాలు తన తుదిశ్వాస విడిచింది. ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. శుక్రవారం రాత్రి 11.40 గంటలకు ప్రాణాలువిడిచినట్లు డాక్టర్లు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. యూపీలోని ఉన్నావ్‌కు చెందిన ఓ యువతి.. తనపై అత్యాచారం జరిపారని.. మార్చిలో ఇద్దరు వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు విచారణలో భాగంగా.. గురువారం రాయ్‌బరేలీలోని కోర్టుకు వెళ్లేందుకు సదరు బాధితురాలు బయల్దేరింది. అయితే కోర్టుకు హాజరయ్యే క్రమంలో ఆమెను.. ప్రధాన నిందితులు దారిలో అటకాయించి.. ఆమెపై హత్యాయత్నం చేశారు. ఆమెపై కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. దీంతో బాధితురాలు మంటలతో.. కేకలు వేస్తూ పరుగులు తీసింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి మంటలను ఆర్పివేసి.. విషయాన్ని పోలీసులకు చేరవేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని.. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే శరీరం 90శాతంకి పైగా కాలిపోవడంతో.. మెరుగైన చికిత్స కోసం.. యూపీ నుంచి ఎయిర్‌ ఆంబులెన్స్‌లో ఢిల్లీకి తరలించారు. రెండు రోజులపాటు చికిత్స పొందిన తర్వాత.. బాధితురాలు తన తుది శ్వాస విడిచింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి.. అయిదుగురు నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.