AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దారుణం: తాగే ద్రావకం అనుకోని..పురుగుల మందు తాగి..

విధి..మనుషుల జీవితాలతో ఎలా ఆడుకుంటుందో చెప్పడానికి ఇప్పుడు చెప్పబోయే ఘటన ప్రత్యక్ష ఉదాహారణ. పురుగుల మందు డబ్బాను తాగే ద్రావకం భావించిన ఇద్దరు చిన్నారులు.. దాన్ని సేవించి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ హృదయవిదారక ఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం పిట్టలగూడెంలో జరిగింది. అప్పటివరకు ఆ చిన్నారులు బడిలో చదువుకోని వచ్చారు. సాయంకాలం సమయం కావడంతో..ఆటవిడుపు కోసం బయటకి వెళ్లారు. కానీ అదే వాళ్ల ప్రాణాలను హరిస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఆటల మధ్యలో ఓ చెట్టు […]

దారుణం: తాగే ద్రావకం అనుకోని..పురుగుల మందు తాగి..
Ram Naramaneni
|

Updated on: Nov 15, 2019 | 3:23 PM

Share

విధి..మనుషుల జీవితాలతో ఎలా ఆడుకుంటుందో చెప్పడానికి ఇప్పుడు చెప్పబోయే ఘటన ప్రత్యక్ష ఉదాహారణ. పురుగుల మందు డబ్బాను తాగే ద్రావకం భావించిన ఇద్దరు చిన్నారులు.. దాన్ని సేవించి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ హృదయవిదారక ఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం పిట్టలగూడెంలో జరిగింది.

అప్పటివరకు ఆ చిన్నారులు బడిలో చదువుకోని వచ్చారు. సాయంకాలం సమయం కావడంతో..ఆటవిడుపు కోసం బయటకి వెళ్లారు. కానీ అదే వాళ్ల ప్రాణాలను హరిస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఆటల మధ్యలో ఓ చెట్టు పక్కనే ఉన్న డబ్బాపై చిన్నారుల దృష్టి పడింది. దాన్ని తాగే ద్రావకంగా భావించిన వారు వెంటనే ఇంటికి తీసుకువచ్చి..గ్లాసుల్లో పోసుకుని తాగేశారు. పెద్దలెవరూ గమనించికపోవడంతో ఊహించని విషాదం చోటుచేసుకుంది. కొద్దిసేపటికే నొట్లో నురగలతో..అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఇద్దరు చిన్నారులను చేర్యాల గవర్నమెంట్ హాప్పటల్‌కి తీసుకెళ్లారు. అక్కడ ట్రీట్‌మెంట్ అందిస్తుండగా ఒకరు..మెరుగైన వైద్యం కోసం సిద్దిపేట హాస్పటల్‌కి తరలిస్తుండగా మరొకరు తనువు చాలించారు. ఊహించని ఈ పరిణామంతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. చనిపోయిన చిన్నారులను తుమ్మల రమేశ్‌ కుమారుడు భాస్కర్‌ (13), కాలియ లక్ష్మణ్‌ కుమారుడు బన్నీ (11) లుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, విచారణ చేపట్టారు.